AP

చంద్రబాబుకు బిగ్ షాక్…

 

టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తూనే ఉంది. ఇప్పటికే అనేక కేసుల్లో తలనొప్పి ఎదుర్కొంటున్న చంద్రబాబుకు తాజాగా మరొక కేసు ఇబ్బందిగా మారనుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది.

 

 

చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3 గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు మరొక కేసులో ఇరుక్కున్నట్టు అయింది.