AP

జగన్ కు మరో భారీ షాక్..

ఏపీలో జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో గెలుపొందే పార్టీలపై నేతలు ఫోకస్ పెట్టారు. భవిష్యత్తును వెతుక్కుంటూ ఆ పార్టీల చెంతకు చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలు పెరుగుతుండడం విశేషం. ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు బలంగా వినిపిస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరుతారని తెలుస్తోంది. జనసేన అగ్ర నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ నుంచి సానుకూలత వచ్చిన వెంటనే జనసేనలో చేరడం ఖాయమని టాక్ నడుస్తోంది.

 

More

From Ap politics

జగ్గంపేటలో వైసీపీ అభ్యర్థిని మార్చుతోంది. చంటి బాబు స్థానంలో తోట నరసింహానికి టికెట్ కేటాయించినట్లు హైకమాండ్ స్పష్టం చేసింది. ఇటీవల చంటి బాబుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన సీఎం క్యాంప్ ఆఫీసునకు వెళ్లారు. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని తేల్చేశారు. అయితే దీనిపై జగన్ తో తాడోపేడో తేల్చుకుంటానని చంటిబాబు బదులిచ్చారు. కానీ హై కమాండ్ మాత్రం తోట నరసింహానికే టికెట్ ఖరారు చేయనున్నట్లు తెలియడంతో పార్టీలో ఉండడం భావ్యం కాదని చంటిబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగ్గంపేటలో మెజారిటీ క్యాడర్ చంటిబాబు వైపు ఉంది. నాలుగు మండలాల జడ్పిటిసి లతో పాటు ఎంపీపీలు పార్టీకి రాజీనామా ప్రకటించారు. చంటిబాబు వెంట నడవడానికి సిద్ధపడ్డారు.

 

అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంటిబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం రాత్రి పవన్ కళ్యాణ్ తో కాకినాడలో రహస్యంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. నాదెండ్ల మనోహర్, నాగబాబులు సైతం ఈ చర్చలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాదాపు గంట పాటు చర్చ కొనసాగినట్లు సమాచారం. వైసీపీలో తనకు ఏ విధంగా అన్యాయం జరిగిందో చంటిబాబు పవన్ కు వివరించి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చంటిబాబు జనసేన లో చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన జనసేన లో చేరిక లాంఛనమేనని తెలుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేటలో చంటిబాబు టిడిపి తరఫున పోటీ చేశారు. ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు.