స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ టీడీపీ నాయకుల్లో నెలకొంది. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు తరఫు లాయర్లు, అవినీతి కేసుల్లో ఈ నిబంధన వర్తించదని సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించిన విషయం విధితమే.
![](https://4news.in/wp-content/uploads/2024/01/539381d649a278f66a2da1bc8cf5fdd8.webp)