వైసీపీ వేసే అడుగులు.. చేసిన పనులు కూటమి జాగ్రత్తగా గమనిస్తోందా? ఈ మధ్యకాలంలో జగన్ టూర్ల వెనుక అసలు కారణమేంటి? ఏపీలో శాంతి భద్రతలు లేవని క్రియేట్ చేసే పనిలోపడ్డారా? అందుకోసమే పోలీసులు ఆంక్షలు పెట్టారా? అయినా పార్టీ నేత చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్పు దేనికి? ఇవే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను సైతం వెంటాడుతున్నాయి.
కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను నెగిటివ్గా మార్చి తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నేత చనిపోయి ఏడాది తర్వాత పల్నాడు ఎందుకు వెళ్తున్నారు? టూర్ ముసుగులో ఏదైనా విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రచారానికి తెరలేపుతున్నట్లు కనిపిస్తోందని టీడీపీ పదేపదే ఎందుకు అంటోంది?
జగన్ పల్నాడు టూర్ గురించి టీడీపీ కీలక విషయాలు బయటపెట్టింది. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరుతారు. అక్కడి నుంచి తన వాహనంలో నేరుగా పల్నాడు జిల్లా రెంటపాళ్లకి చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల వైస్ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇంతవరకు షెడ్యూల్ బాగానే ఉంది.
ఇంతకీ నాగమల్లేశ్వరరావు ఎవరు? ఎప్పుడు చనిపోయాడు? దీనివెనుక అసలు కారణం ఎవరు అనే విషయాలను బయటపెట్టింది టీడీపీ.