APTELANGANA

నిర్మలా సీతారామన్ అల్లుడు ఏం చేస్తారో తెలుసా?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం ప్రతీక్‌(Pratik Doshi)తో నిరాడంబరంగా జరిగింది.

స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని మంత్రి ఇంట్లోనే పెళ్లి వేడుక పూర్తిచేశారు.

రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎవరూ హాజరుకాలేదు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించలేదు. అయితే వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ప్రతీక్ ఎవరో? ఏం చేస్తుంటారో తెలుసుకుందాం.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. పీఎంవోలో కీలక వ్యక్తిగా విధులు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి పీఎంవోతో అనుబంధం కొనసాగుతోంది. 2019 జూన్ లో జాయింట్ సెక్రటరీ ర్యాంకులో (రీసెర్చి& స్ట్రాటజీ)గా నియమితులయ్యారు. ప్రధానమంత్రికి కళ్లు, చెవులూ తానై ప్రతీక్‌ వ్యవహరిస్తారు. జాతీయ పత్రికలు సైతం ప్రతీక్‌తో ఇలాగే వ్యవహరిస్తాయి. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో ఎంబీఏ చేశారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవోలో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రచారానికి దూరంగా ఉంటారు. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండరు.