మేడారంలో మొదలైన మహాజాతర: గద్దెపై కొలువుదీరిన సారలమ్మ!
నేడు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని మేడారం గద్దెకు తీసుకురావడంతో నాలుగు రోజుల మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. అంతకుముందు కన్నెపల్లిలోని ఆలయంలో కోయ పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి పసుపు, కుంకుమ భరిణ రూపంలో ఉన్న అమ్మవారిని చేతబూని, జంపన్న వాగు మీదుగా కాలినడకన మేడారం చేరుకున్నారు. ఈ సమయంలో భక్తుల పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. గద్దెలపైకి చేరుకున్న ఇతర దైవాలు…

