తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను… ఈసారి వచ్చేది బీజేపీనే: ప్రధాని మోదీ..
తెలంగాణలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, వారి కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోదీ తన…

