తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో…

