Editor

National

తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.   నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో…

TELANGANA

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు.. వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది.   దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదో…

National

బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్..! కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు (మే 7) అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి అధికారికంగా ముగిసింది. “భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ 2 ప్రకారం నాకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి, పశ్చిమ బెంగాల్ శాసనసభను 2026 మే 7 నుంచి రద్దు చేస్తున్నాను” అని గవర్నర్…

TELANGANA

రేషన్ ఫాపుల్లో ఇకపై అవి కూడా పంపీణీ..?

రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కవ ధరకు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా పేదల చెంతకు చేర్చేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ పంటలను బహిరంగ మార్కెట్‌లో వేలం వేసి మధ్యవర్తులకు లాభం చేకూర్చకుండా, సివిల్ సప్లై శాఖ ద్వారా రేషన్ షాపుల లో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. త్వరలోనే…

AP

గజరాజులకు ‘ఆధార్’.. ఏపీ అటవీశాఖ వినూత్న ముందడుగు..

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ గజరాజుల రక్షణ కోసం ఒక వినూత్నమైన అడుగు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆరు కుంకీ ఏనుగులకు ప్రత్యేకంగా ‘ఆధార్’ తరహా గుర్తింపు కార్డులను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కుంకీ ఏనుగులు అంటే అడవి ఏనుగులను దారికి తెచ్చేందుకు, ఇతర ఆపరేషన్లలో అటవీశాఖకు సాయపడే శిక్షణ పొందిన ఏనుగులు. వీటి రక్షణ, ఆరోగ్యం విషయంలో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.   ఈ…

Uncategorized

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్..! విజయ్‌కు పోటీగా డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయా..?

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్! బద్ద రాజకీయ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని డీఎంకే పార్టీ కొట్టి వేయడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలు గెలిచి, మేజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ (5) మద్దతిచ్చినప్పటికీ విజయ్‌కి బలం సరిపోలేదు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లు కూడా…

TELANGANA

రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్..

వరంగల్ వేదికగా జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని కొనియాడిన కేటీఆర్, ఇక్కడి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం వరంగల్‌లో కాంగ్రెస్ ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ ఒక నయవంచన అని, అది కేవలం ఓట్ల కోసమే చేసిన ‘కొంగజపం’ అని ఆయన మండిపడ్డారు. డిక్లరేషన్‌లో ఇచ్చిన 34 హామీలను గాలికొదిలేశారని,…

AP

ఏపీకి రూ.1000 కోట్ల పెట్టుబడి.. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన.

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ ‘క్యారియర్ గ్లోబల్’ యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం క్యారియర్ సంస్థ సుమారు రూ. 1,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3,000 మందికి ఉపాధి,…

National

బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత .

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింస తీవ్ర రూపం దాల్చింది. బీజేపీ చారిత్రక విజయం సాధించిన రెండు రోజుల తర్వాత, ఆ పార్టీ కీలక నేత, ‘జెయింట్ కిల్లర్’గా పేరు పొందిన సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.   చంద్రనాథ్ రథ్ కారులో ప్రయాణిస్తుండగా…

National

సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే లక్ష్యంతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మినహా మిగతా జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కు పెంచనుంది. ఈ మేరకు “సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026″కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.   న్యాయమూర్తుల సంఖ్య పెంపు ద్వారా సుప్రీంకోర్టు పనితీరు మెరుగుపడుతుందని,…