Editor

AP

వడ్డెర్లకు మైనింగ్ లీజులు… మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్..

రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. వారి కులవృత్తిని ప్రోత్సహించి, ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కేటాయించాలని నేడు ఏపీ క్యాబినెట్ మంత్రివర్గం నిర్ణయించింది. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   గతంలో లోకేశ్ పాదయాత్ర…

TELANGANA

సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు.   సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే…

AP

కీలక అంశాలపై ఏపీ క్యాబినెట్ తీర్మానాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించి, కొత్త రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ నెల 28న జరగనున్న ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు. అనంతరం, పునర్విభజన…

National

పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. పశ్చిమాసియాలో 27 రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. యుద్ధానికి అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ కొనసాగుతోంది.   సంక్లిష్ట పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం   పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ప్రధానమంత్రి…

AP

బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పాలాభిషేకం…

  అనంతపురం జిల్లా RDT సంస్థకు సంబంధించిన ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (FCRA) నమోదు పునరుద్ధరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వెలువడిన సందర్భంగా ఈ అంశానికి సంబంధించి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారిని అభినందనలు తెలుపుతూ ఈరోజు కదిరి నియోజకవర్గంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.…

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’: డ్రోన్లతో గాలింపు.. కార్డన్ సెర్చ్‌తో నేరగాళ్ల గుండెల్లో వణుకు!

శ్రీ సత్య సాయి జిల్లా..   ఆపరేషన్ ‘వజ్రప్రహార్’లో భాగంగా మంగళమడక , ఎన్.పి కుంట గ్రామాలలో కార్డెన్, సర్చ్ నిర్వహించిన పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో కార్డన్ & సెర్చ్. మత్తు పదార్థాల నిర్మూలనపై ఉక్కుపాదం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన పోలీసులు.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు, *జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్…

AP

ఘోర బస్సు ప్రమాదం…. కనీసం 10 మంది సజీవదహనం……

  ఆంధ్రప్రదేశ్: * మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. * రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. * మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి. * కనీసం 10 మంది సజీవదహనం అయ్యారు. * మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. * చందూ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి ఉదయగిరి వెళ్తేందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. *…

AP

విజయవాడలో ఉగ్ర కలకలం… ముగ్గురు యువకుల అరెస్ట్..

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ అధికారులు మంగళవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ (23), ఎండీ డానిష్ (27), మీర్జా సోహైల్ బేగ్ (23)‌లను అదుపులోకి తీసుకున్నారు.   విజయవాడలోని వించిపేటలో నిందితుల నివాసాల సమీపంలో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నివాసాల్లో సోదాలు…

National

మతం మారితే రిజర్వేషన్లు కట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

రాజ్యాంగబద్ధంగా సంక్రమించే రిజర్వేషన్ ఫలాల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలకు (SC) కేటాయించిన ప్రయోజనాలు కేవలం నిర్దేశిత మతాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేస్తూ, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై ఎస్సీ రిజర్వేషన్ల కింద పొందే రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలకు అనర్హులవుతారని న్యాయస్థానం తేల్చి చెప్పింది.   అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన…

TELANGANA

జగిత్యాలలో హైటెన్షన్.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి..

జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఉదయం టీపీసీస అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ సందడి మొదలైంది. పార్టీ అంతర్గత పరిణామాలు గందరగోళానికి దారితీయడంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నేరుగా రంగంలోకి దిగింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది.   ఈ సంక్షోభ నివారణ…