Editor

TELANGANA

డీలిమిటేషన్ పై పోరాటం.. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి- సీఎం రేవంత్ రెడ్డి..

“నేను దేశ రాజకీయాల్లో పనిచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. మోడీ త్రీడి పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతం ఐక్యం కావల్సి ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి కేంద్రంలో తక్కువ ప్రాతినిధ్యం ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ పై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. వెంకయ్య నాయుడును రాష్ట్రపతి ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు…

AP

జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. నోవాటెల్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశంపై కూలంకషంగా చర్చించనున్నారు. కేవలం ఎన్నికల విజయానికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా జనసేనను ప్రతి గ్రామంలోనూ నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.   ముఖ్యంగా పార్టీని…

AP

కదిరిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం: ‘టీబీ అంతం – మన పంతం’ అంటూ భారీ ర్యాలీ

ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా కదిరి టీబి యూనిట్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉన్న సాయంత్రం పూట జ్వరము వస్తూ ఉన్న దగ్గినప్పుడు గళ్ళలో రక్తం పడిన బరువు తగ్గిపోతున్న వారు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో గల్ల పరీక్ష మరియు వీలైతే ఎక్సరే కూడా చేయించుకోవాలి ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే…

National

ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు..

పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతున్న సముద్ర మార్గంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు కీలక ఇంధన నౌకలు భారత్‌కు బయల్దేరాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు.   విశ్వసనీయ వర్గాల సమాచారం…

AP

ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో భారీ అధ్యాయం మొదలైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) ఇండియా ఏర్పాటు చేయనున్న మెగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు సోమవారం శంకుస్థాపన జరిగింది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌గా నిలవనున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా, పారిశ్రామిక ఆవిష్కరణలలో ఏపీని ముందంజలో నిలుపుతుందని ఆయన…

TELANGANA

దేశంలోనే తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్..

హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏళ్లుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద వాహనాల రాకపోకల కోసం మల్టీ-లేన్ అండర్‌పాస్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి అనుమతులు సాధించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.   సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. సుచిత్ర జంక్షన్ నుంచి ప్యారడైజ్…

National

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు..!

మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల (2029) నుంచి చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన రెండు బిల్లులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఒక సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్‌సభలోని ప్రస్తుత 543 స్థానాలను 50 శాతం పెంచి, మొత్తం 816కి చేర్చనున్నారు. కొత్తగా పెరిగే 273 సీట్లను పూర్తిగా…

AP

అమరావతిపై కుట్రలు సహించం.. హోంమంత్రి అనిత సీరియస్..

రాజధాని అమరావతిలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు కుట్రలు పన్నినా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.   అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. సోమవారం అర్ధరాత్రి రాయపూడి సమీపంలోని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంపై వివరాలు వెల్లడించారు. ఐదు అగ్నిమాపక వాహ‌నాలు శ్రమించి…

CINEMA

పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన పునర్నవి భూపాలం: ఫొటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఏడడుగులు!

తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 ద్వారా విశేష ఆదరణ పొందిన నటి పునర్నవి భూపాలం వివాహ వేడుక శనివారం ఘనంగా జరిగింది. తన చిరకాల ప్రియుడు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ హేమంత్ వర్మతో కలిసి ఆమె ఏడడుగులు వేసింది. ఇరు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జంటను చూసి అభిమానులు…

TELANGANA

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు: పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ సీజ్!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. ఈ ఫాంహౌస్‌ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ‘అసైన్డ్ భూమి’లో నిర్మించినట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించడమే కాకుండా, డ్రగ్స్ పార్టీకి వేదికగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీకి…