ఏపీకి రండి.. బెంగళూరు స్టార్టప్కు మంత్రి లోకేశ్ ఇన్విటేషన్.. కాసేపట్లోనే రెస్పాన్స్..
బెంగళూరులో ఎదురవుతున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్కు అవకాశాలుగా మలుచుకోవడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో చొరవ చూపారు. భూమి కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఓ ప్రముఖ స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వెంటనే స్పందించిన లోకేశ్.. ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్ (Pixxel) అనే స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు క్షితిజ్ ఖండేల్వాల్, తమ శాటిలైట్ తయారీ కేంద్రం కోసం నగరం శివార్లలో…

