ఆరేళ్ల తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, తన అక్రమాస్తుల కేసుకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం ఇదే మొదటిసారి. 2013 సెప్టెంబరు నుంచి ఈ కేసుల్లో బెయిల్పై ఉన్న జగన్, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. అయితే, డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున తప్పనిసరిగా…

