Editor

AP

లిక్కర్ స్కామ్.. కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్..!

ఎట్టకేలకు మద్యం కుంభకోణంపై నోరు విప్పారు మాజీ సీఎం జగన్. రేపో మాపో ఆయన అరెస్టు అవుతారన్న వార్తల నేపథ్యంలో వాటిపై ఆసక్తికర స్టేట్‌మెంట్ చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని తేల్చేశారు. ఆయనకు ఆయనే క్లీన్‌చిట్ ఇచ్చుకున్నారు. తప్పంతా చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని ఎదురుదాడి మొదలుపెట్టారు.   భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్షాలు సృష్టించి అరాచకంగా ప్రభుత్వం వ్యవహారి స్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తనను బెదిరిస్తుందని చెబుతూ ఏపీ బేవరేజెస్ మాజీ…

AP

జగన్‌కి కౌంటర్, తారకరత్న భార్య పోస్టు.. సాయిరెడ్డికి మద్దతుగా..

ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెత మాజీ సీఎం జగన్‌కు అతికినట్టు సరిపోతుంది. కోర్ టీమ్ ప్లాన్‌తో నమ్మినబంటు విజయసాయిరెడ్డిని జగన్ దూరం చేసుకున్నారు. దాని పర్యవసానాలు ఇప్పుడిప్పుడే జగన్ అర్థమైనట్టు కనిపిస్తోంది. దాన్ని నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి విజయసాయిరెడ్డిని టార్గెట్‌గా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తన బాబాయి విజయసాయిరెడ్డికి మద్దతుగా ఆసక్తికరమైన పోస్టుపై చర్చ జరుగుతోంది.   ఇదీ అలేఖ్య…

NationalTechnology

గూగుల్ ఏఐ మోడ్… ఏదైనా చిటికెలోనే..!

ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసే దిశగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కీలక అడుగులు వేస్తోంది. తన వార్షిక డెవలపర్ల సమావేశం ‘గూగుల్ I/O 2025’లో భాగంగా, వినియోగదారుల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత షాపింగ్ ఫీచర్లను ఆవిష్కరించింది. ఈ నూతన ఆవిష్కరణలు కొనుగోలు ప్రక్రియను మరింత వ్యక్తిగతంగా, సౌకర్యవంతంగా మార్చనున్నాయి.   గూగుల్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ AI షాపింగ్ ఫీచర్లకు జెమినీ AI సాంకేతికత మరియు గూగుల్ షాపింగ్ గ్రాఫ్…

TELANGANA

గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేస్తూ.. 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిన రేవంత్ సర్కార్..

గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ విడతలో చెల్లించడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం…

AP

వైఎస్ జగన్ మీడియా సమావేశం..! కారణం అదేనా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం రాజకీయంగా ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమి మాట్లాడతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వైఎస్సార్‌సీపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రజలకు కొన్ని కీలక సందేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేసిన…

National

పాక్ ఏజెంట్ కు పెళ్లి ప్రపోజల్ చేసిన యూట్యూబర్ జ్యోతి..!

దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూ సంచలనం సృష్టిస్తోంది.   గత వారం అదుపులోకి తీసుకున్న జ్యోతి మల్హోత్రాను అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు…

AP

నూతన రేషన్ విధానంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి నాదెండ్ల..

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) ద్వారా ఇంటింటికీ రేషన్ అందించే ప్రక్రియను నిలిపివేసి, తిరిగి చౌకధరల దుకాణాల (రేషన్ షాపుల) ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…

National

జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు..!

దేశ ద్రోహి,పాక్‌ గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ టూర్ కు సంబంధించిన వివరాలను పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పాకిస్థాన్ జర్నీ ఆహ్లాదకరంగా సాగిందని.. అక్కడ ఆతిథ్యం బాగుందని రాసుకొచ్చింది.   ఈ మేరకు జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ ను పొగుడుతూ రాసుకున్నట్లు పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ..

తెలంగాణలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీ అంగన్‌వాడీలను పూర్తిస్థాయి అంగన్‌వాడీలుగా గుర్తించి, వారికి పెంచిన వేతనం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.   రాష్ట్రంలో పనిచేస్తున్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నిరుపేద వర్గాలకు అంకితభావంతో సేవలు…

TELANGANA

హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం.. నకిలీ పత్రాలతో..

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తూ, నకిలీ పత్రాలతో భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందిన మయన్మార్ దేశస్థుల ముఠా గుట్టు రట్టయింది. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో మయన్మార్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరు కొన్నేళ్ల క్రితం మయన్మార్ నుంచి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించి, ఇక్కడ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మదర్సాలో పనిచేసే కొందరు ఉపాధ్యాయుల పాత్ర…