Editor

CINEMA

కీర్తి సురేష్ కోసం స్టార్ హీరోయిన్‌కు మస్కా కొట్టిన కిషోర్ తిరుమల: ‘నేను శైలజ’ వెనుక అసలు కథ!

దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నేను శైలజ’ ద్వారా కీర్తి సురేష్ టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో శైలజ పాత్ర కోసం కీర్తిని ఎంపిక చేయడం వెనుక ఒక పెద్ద డ్రామా జరిగిందని దర్శకుడు ఇటీవల వెల్లడించారు. కథ రాసుకున్నప్పుడే ‘శైలజ’ అనే ఇంట్రోవర్ట్ పాత్రకు కీర్తి సురేష్ అయితేనే సరైన న్యాయం చేస్తుందని ఆయన బలంగా నమ్మారు. కానీ అప్పట్లో ఆమె కొత్త కావడంతో, నిర్మాతలు ఒక…

AP

కదిరి రూరల్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా గారు

ఈరోజు కదిరి మండలం రూరల్ కన్వీనర్ మణికంఠ గారి అధ్యక్షతన రూరల్ మండల నాయకులు కార్యకర్తలుతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ అన్న గారి అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా గారు పార్టీ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను, ఉద్దేశించి మాట్లాడుతూ గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు…

AP

జూదరుల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: 9 మంది అరెస్ట్, రూ. 92 వేల నగదు స్వాధీనం

శ్రీ సత్య సాయి జిల్లా… పేకాట స్థావరంపై పోలీసులు విస్తృత దాడులు.. 9 మంది అరెస్టు.. రూ,92,590 నగదు తో పాటు 9, సెల్ఫోన్లు ,4, ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల తో.. కదిరి డిఎస్పి శివన్నారాయణ స్వామి ఆదేశాల మేరకు.. కదిరి రూరల్ సిఐ నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్.పి కుంట మండలంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తలుపుల, గాండ్లపెంట…

AP

ప్రజల చెంతకే పాలన: గూటిబైలు ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కందికుంట కసరత్తు

ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం! కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం ​ఈరోజు నంబుల పూలకుంట మండలం గూటి బైలు (తిమ్మమ్మ మర్రిమాను) గ్రామంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించడం జరిగింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నాను. ​ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక…

AP

స్వచ్ఛాంధ్ర దిశగా కదిరి ముందడుగు: కుమ్మరవాండ్లపల్లిలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

కదిరి రూరల్ కుమ్మర వాండ్ల పల్లి సచివాలయం నందు స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు సుపరిపాలనకు నిదర్శనం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఇస్తే, ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ రథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

AP

పరిటాల రవీంద్ర గారి వర్ధంతి వేడుకల సందర్భంగా కదిరి ఎమ్మెల్యే ఘన నివాళులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి వేడుకలను శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిటాల రవీంద్ర చిత్రపటానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేదల పక్షపాతిగా పరిటాల రవీంద్ర గారు చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే…

TELANGANA

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వార్తలు అబద్ధం.. సిట్ విచారణపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి తాను బెదిరింపులకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను అధికారులను నిలదీయగా, అటువంటి లీకులు తాము ఇవ్వలేదని, ఆ ప్రచారంలో నిజం లేదని వారు అంగీకరించారని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం కావాలనే లీకులిస్తూ తన వ్యక్తిత్వ హననానికి…

TELANGANA

ఆదిలాబాద్‌లో ఏసీబీ పంజా: రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఉద్యోగి

ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. బజార్‌హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి, ఓ రైతు నుంచి రూ. 2 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సాదా బైనామా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసేందుకు ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. బాధితుడు తన 8.35 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం…

AP

విజయవాడ పోలీసులకు మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు: గంటల వ్యవధిలోనే తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం

సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందించే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మరోసారి తన చొరవతో ఒక కుటుంబాన్ని కలిపారు. విజయవాడలో రెండు రోజుల క్రితం ఒక మహిళ తప్పిపోయిందని, ఆమెను వెతకడంలో సహాయం చేయాలని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి, సదరు మహిళ ఆచూకీ కనిపెట్టాలని విజయవాడ పోలీసులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన…

CINEMA

చిరంజీవి సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్: వాస్తవ లెక్కలు ఇవ్వాలని ఆదేశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. ఈ సినిమా టికెట్ ధరలను చట్టవిరుద్ధంగా పెంచారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, దీనికి సంబంధించిన వాస్తవ లెక్కలను సమర్పించాలని జీఎస్టీ (GST) అధికారులను ఆదేశించింది. పెంపు ద్వారా వచ్చిన ఆదాయం మరియు ప్రభుత్వ నిబంధనల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమా టికెట్ ధరలను…