బీజేపీకి రేవంత్ వార్నింగ్ – మరో ఉద్యమానికి శ్రీకారం..
పార్లమెంట్ స్థానాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాధి రాష్ట్రాలకు అన్యాయం జరుగే అవకాశాలున్నాయనే ఆందోళనల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటుగా ప్రజల్లోనూ చైతన్యం కలిగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. డీలిమిటేషన్ విషయమై తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో సమావేశమైన దక్షిణాధి రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత.. ఇకపై ఈ మహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ ఆకారం అందించనుంది అని ప్రకటించారు. జాతీయ పార్టీగా ఉత్తర, దక్షిణాధి…

