Editor

TELANGANA

ప్రతి పైసాకు నా దగ్గర లెక్కుంది.. KTR సంచలన వ్యాఖ్యలు…

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ రేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా రూ.55కోట్లు ఎలా బదలీ చేస్తారనే ఆరోపణలు ప్రధానంగా ఆయన ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయనను ఈడీ అధికారులు విచారించనున్నారు.   అయితే ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను జనవరి 9న విచారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన…

AP

లిక్కర్, ఇసుక కుంభకోణాల్లో చాలా మంది జైలుకు వెళతారు: నారా లోకేశ్..

కనుమ పండుగ వేళ ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్, ఇసుక కుంభకోణాల్లో త్వరలోనే చాలా మంది జైలుకు వెళతారని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. నారావారిపల్లెలో ఉన్న నారా లోకేశ్ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   పార్టీ…

National

15 నెలల యుద్ధానికి స్వస్తి.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన డీల్…

ఇజ్రాయెల్-హమాస్ మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పగా, తమ అధీనంలో ఉన్న బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడంతో కథ సుఖాంతమైంది.   ఈజిప్ట్, ఖతర్, ఇజ్రాయెల్‌తో కలిసి తాము కొన్ని నెలలపాటు జరిపిన దౌత్యం అనంతరం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు…

CINEMA

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి.. ఆరు చోట్ల గాయాలు..

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడిచేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆయనపై దాడిచేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు.   ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్ కుటుంబం నిద్రలో ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి యత్నించాడు. అలికిడికి మెలకువ…

AP

ఏపీ వ్యాప్తంగా కోడి పందేల హోరు.. చేతులు మారిన వేల కోట్ల రూపాయలు..!

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన కోడి పందేల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోనసీమ నుంచి రాయలసీమ వరకు రాష్ట్రం కోడిపందేలతో హోరెత్తింది. ఎక్కడ చూసినా పందేలు జాతరను తలపించాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క పందెమే రికార్డు స్థాయిలో రూ. 1.25 కోట్లు పలికింది. ఏలూరులో అయితే ఓ వ్యక్తి రూ. 2 కోట్ల పందేనికి సైతం సై అన్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో 1500కుపైగా బరుల్లో పందేలు జరిగాయి. కోడి…

National

ఢిల్లీ పీఠం దక్కేదెవరికి..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. మూడు పార్టీలు శక్తి వంచన లేకుండా గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి. తిరిగి అధికారం దక్కించుకోవటం కోసం కేజ్రీవాల్ ఇతర పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ తమకు కలిసి వస్తుందనే ధీమాతో ఉంది. కాగా, బీజేపీ మాత్రం గెలుపు ఖాయమనే విశ్వాసంతో కనిపిస్తోంది. అయితే, ఢిల్లీ ఓటర్ పల్స్ మాత్రం క్లియర్ గా ఉంది.…

AP

ఏపీలో మరో పెన్షన్ సర్వే-ఈసారి టార్గెట్ వారే..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయం పెన్షన్ల పెంపు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు.. అదే సమయంలో అనర్హులకు వీటి ప్రయోజనం అందకుండా కట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో అధికారులు పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేపడుతున్నారు. ఇప్పటికే అనర్హుల గుర్తింపుకు పలు సర్వేలు చేసిన అధికారులు ఇప్పుడు మరో సర్వేకు సిద్దమయ్యారు.   ఇప్పటివరకూ ఏపీలో…

AP

పవన్ బావ.. లోకేష్ అన్న.. శ్రీ రెడ్డి సంచలన ట్వీట్..

మొన్నటి వరకు నన్ను వదిలేయండి మహాప్రభో అంటూ విన్నపాలు. లోకేషన్నా సారీ.. పవన్ అన్నా సారీ.. నేను ఇక రాజకీయాల జోలికి రాను. నాకు అవసరం లేదు. నన్ను మాత్రం వదిలేయండి అంటూ మాటలు.. కన్నీళ్లు. నేడు మాత్రం నేను మళ్లీ వచ్చేశా అనే రేంజ్ లో ఓ ట్వీట్. ఆ ట్వీట్ తో కూటమిలో లుకలుకలు పెట్టేందుకే ప్రయత్నిస్తోందని తెగ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.. శ్రీరెడ్డి. సైలెంట్ గా ఉన్న…

TELANGANA

తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక .. నేడు జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..

నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం నేడు నెరవేరుతోంది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ (ఇందూరు)లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది.   గత ఏడాది అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పసుపు బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, తాజాగా…

TELANGANA

భూములు తీసుకోవద్దంటూ పొలాల్లో సకినాలు చేస్తూ నిరసన

రింగ్ రోడ్డు కోసం తమ భూములు తీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాలో కొందరు రైతులు సకినాలతో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా వరంగల్ మండలంలోని ఆరెపల్లి – పైడిపల్లి – కొత్తపేట గ్రామాల మీదుగా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.   ఈ ప్రతిపాదన కారణంగా తాము విలువైన భూములను కోల్పోతున్నామంటూ వరంగల్ మండలం ఆరెపల్లి శివారులోని పంట భూముల్లో…