తిరుమల లడ్డూ వివాదం: రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై వాస్తవాలను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) జరిగిన పరిపాలన లోపాలు, నెయ్యి కొనుగోలు టెండర్లు మరియు కల్తీ నెయ్యి…

