Editor

TELANGANA

కేటీఆర్‍ మతిస్థిమితం కోల్పోయారు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు…

మాజీ మంత్రి కేటీఆర్ పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా ఉన్నాయన్నారు. విద్యుత్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అనడం ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని చెప్పారు.   గ్యారంటీలు వందరోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడమేనని పేర్కొన్నారు. కొంచెం ఆలస్యం అయినా కాంగ్రెస్ గ్యారెంటీలు…

TELANGANA

మూసీ నదిపై ఆర్కిటెక్ట్‌లతో సీఎం రేవంత్ సమావేశం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వివరణాత్మక చర్చలు జరిపారు. మూసీ నదిపై మాట్లాడారు. మారథాన్ బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్‌లు ప్రధానంగా 56-కిలోమీటర్ల పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై చర్చలు జరిపారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి తెలిపారు. తదుపరి సంప్రదింపుల కోసం…

AP

ఏపీలో.. ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు: షెడ్యూల్ విడుదల కావడమే ఆలస్యం..!

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో జాబితాపై కసరత్తు చేస్తోంది.   ఈ నెల 25వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీని తరువాత షెడ్యూల్…

AP

జనసేనలో చేరుతున్నా.. పవన్ కళ్యాణ్‌పై బాలశౌరి ఆసక్తికర వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలోకి మరో సీనియర్ నేత చేరిక ఖాయమైంది. ఇటీవల అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి త్వరలో మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు.   అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు తెలిపారు. పవన్ తో వివిధ అంశాలపై రెండు గంటలపాటు చర్చించినట్లు…

APNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్- అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు.

TELANGANA

హైదరాబాద్ నడిబొడ్డున గల చారిత్రక ఆలయంలో.. గవర్నర్..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.   రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలనూ పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్‌ను ప్రారంభించారు. కొద్దిరోజుల కిందటే నాసిక్‌లోని ప్రాచీన…

TELANGANA

కరెంట్ బిల్లులు కట్టవద్దు, సోనియాకు పంపండి – కేటీఆర్..!!

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. వీటి పైన కేటీఆర్ స్పందించారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దామని.. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టిపెట్టాలంటూ సూచించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు జనవరి కరెంట్ బిల్లులు చెల్లించవద్దంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.   దావోస్ పర్యటన ముగించుకొని లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు…

APCINEMA

త్వరలో ప్రజా సేవలోకి ప్రభాస్ – ఎన్నికల్లో పోటీ, కృష్ణంరాజు సతీమణి క్లారిటీ..!!..

కృష్ణంరాజు కుటుంబానికి ఎంపీ సీటు ఆఫర్ వచ్చింది. మూడు పార్టీల నుంచి కృష్ణంరాజు సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ ఎంట్రీ గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామల క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ భవిష్యత్ కార్యక్రమాల గురించి తేల్చి చెప్పారు. గోదావరి జిల్లాల ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేసారు. ప్రభాస్ సైతం ప్రజాసేవలోకి వస్తున్నారని శ్యామల కీలక వ్యాఖ్యలు చేసారు.   రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు జయంతి కావటంతో కుటుంబ…

AP

జగన్ ట్రాప్ లో చంద్రబాబు – ఎన్నికల వేళ సెల్ఫ్ గోల్..!! .

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసారు. టీడీపీ, జనసేన అభ్యర్దుల ఎంపిక పైన చర్చలు కొనసాగిస్తున్నాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ కొత్త అస్త్రాలను ప్రత్యర్ధి పార్టీలను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.   జగన్…

National

మంత్రముగ్ధం రాములోరి రూపం..అయోధ్యలో ప్రాణం పోసుకోనున్న విగ్రహం ఇదే

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.   ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,…