Editor

AP

చంద్రబాబుకు మంత్రి గోవర్ధన్ రెడ్డి సవాల్..!!

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మూడు నెలల తరువాత చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పైన చేసిన విమర్శలకు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పందించారు. చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు.   టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సీరియస్‌…

CINEMA

హిమాలయాల్లో ఒంటిపై నూలుపోగు లేకుండా తిరుగుతున్న స్టార్ హీరో..

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్. శక్తి, ఊసరవెల్లి, తుపాకి వంటి సినిమాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితుడైన నటుడు. బాలీవుడ్‌లో హీరోగా పలు సినిమాల్లో కనిపించారు. యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ సినిమాలతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువ అయ్యారు.   ప్రస్తుతం అతను నటిస్తోన్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం అవుతున్నాయి. షేర్ సింగ్ రాణా, క్రాక్ సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండూ కూడా యాక్షన్ థ్రిల్లర్లుగా తెరకెక్కుతున్నాయి.…

CINEMA

గుంటూరు కారంలో సడన్ ట్విస్ట్..

సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి.. అయితే చుక్కలన్ని ఒకవైపు చంద్రుడు మాత్రమే ఒకవైపు అన్నట్టు ఉంది గుంటూరు కారం పరిస్థితి. ఈ మూవీ కి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫాన్స్ దాన్ని క్రేజీగా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఎప్పుడూ లేనంత మాస్ గెటప్ లో దంచేస్తున్నాడు. మూవీ నుంచి వచ్చిన మంచి మసాలా సాంగ్ కూడా ప్రేక్షకులలో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రంపై అంచనాలు…

AP

నిరుద్యోగులను మోసం చేయడానికే ఇప్పుడు నోటిఫికేషన్లు : టిడిపి నేత గంటా..

ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరుగనుండగా.. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం.. జగన్ ప్రభుత్వం వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ అని తెలుగుదేశం సీనియర్ నాయకులు గంటా శ్రీనివాస్ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం గ్రూప్-1,గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని గంటీ శ్రీనివాస్ తప్పుబట్టారు.   ఇన్ని సంవత్సరాల పాటు నిరుద్యోగులను మోసం చేసి సరిగ్గా ఎన్నికల ముందు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో జగన్ ప్రభుత్వం చేస్తున్న మరో మోసం అని చెప్పారు. అసలు…

TELANGANA

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సిఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

ఆడబిడ్డల ముఖంలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.   “తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణ మొదలైంది. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి…

TELANGANA

త్వరలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్పీకర్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రొ టెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంతో బిజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎంఐఎంతో రాజకీయ లబ్ధ కోసమే అక్బరుద్దీన్‌ని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించారని ఆరోపణలు చేశారు.   మరోవైపు స్పీకర్ ఎన్నిక కోసం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి నామినేషన్లకు రెండు రోజుల గడువు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గడ్డం ప్రసాద్‌ను…

AP

మూడు నెలల్లో ఏపీ ఎన్నికలు? తెలంగాణ ఎన్నికల తరువాత జగన్ వ్యూహం ఏమిటి..?

తెలంగాణలో కొత్త సభ కొలువుదీరింది. ఇక, ఏపీ సంగతేంటి? అక్కడి రాజకీయం రగులుతోంది. ఎప్పుడు ఎన్నికలొస్తాయో చంద్రబాబు చెప్పేశారు. ఎవరికి టికెట్లు ఇస్తానో కూడా క్లారిటీ ఇచ్చారు. మరి సీఎం జగన్ సంగతేంటి? సిట్టింగ్‌లకు మళ్లీ ఛాన్సిస్తారా? మారుస్తారా?   మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు వ్యూహరచన చేస్తున్నారు. జనసేనతో పొత్తుపై చాలా క్లారిటీతో ఉన్నారు చంద్రబాబు. సీట్ల పంపకాల మీద కూడా మాటలు నడిచాయి.…

TELANGANA

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నిర్వాకం.. ఇంకా క్యాంపు ఆఫీస్‌లోనే తిష్ట..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాజీ ఎమ్మెల్యేల తీరు మాత్రం మారటం లేదు. నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిర్వాకం.. స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓటమి తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేసి.. కొత్తగా ఎన్నికైనా వారికి ఇవ్వాల్సిన ఆయన.. ఆ ఆఫీస్‌లోనే మంతనాలు చేస్తున్నారు. కార్యకర్తలతో భేటీ అవుతూ.. బిజీబిజీగా ఉన్నారు.   ఓటమి తర్వాత BRS అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR రాజీనామా చేసి ప్రగతి భవన్…

TELANGANA

కోదండరామ్‌కు సముచిత స్థానం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి..?

టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నంది. కోదండరామ్‌కు నూతన సర్కార్‌ లో సముచిత స్థానం లభించనుంది.   కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నారు. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ పొత్తు పెట్టుకునేలా…

AP

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. జనవరి 19కి వాయిదా..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జనవరి 19కు వాయిదా పడింది. ఈ పిటిషన్ పై గతంలోనే వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టింది.   స్కిల్ కేసులో 17…