Editor

AP

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..

ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ -1 కు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్-1 కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు.   డిప్యూటీ కలెక్టర్ -9, డీఎస్పీలు – 26 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవలసిన వారు https://psc.ap.gov.in ను చూడవచ్చు. ఏపీ సివిల్ సర్వీస్…

National

బీఆర్ఎస్ నేత కనుసన్నల్లో.. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా..

సంగారెడ్డి జిల్లాలో ఎస్వీటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిన్నారం మండలం కొడకాంచి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామ శివారులో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.   6 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా.. బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కనుసన్నల్లోనే అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్ఫా జోలం, హేరైన్, కొకైన్‌తోపాటు పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

CINEMA

బింబిసార కాంబినేషన్ రిపీట్…?

నందమూరి కళ్యాణ్ రామ్.. నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. కెరీర్ మొదట్లో మంచి ప్రామిసింగ్ సినిమాలు చేసి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోకి బింబిసార సినిమాతో మంచి కం బ్యాక్ దొరికింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇందులో హీరోయిన్స్ గా నటించిన హాట్ బ్యూటీస్ సంయుక్తా మీనన్,కేథ‌రిన్ థెస్రా లు ఈ…

AP

అమెరికా కాదు అంతరిక్షం నుంచి వచ్చినా.. గుడివాడలో టీడీపీ ఎన్నారై ఇన్ ఛార్జ్ పై కొడాలి ఫైర్..

గుడివాడలో తనను ఓడించేందుకు టీడీపీ అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును ఇన్ ఛార్జ్ గా ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై కొడాలి ఫైర్ అయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రతి ఎన్నికలో డ్యూటీ ఎక్కి, దిగినట్లు ఒక అభ్యర్థి వచ్చి వెళుతూ ఉంటారన్నారు.   తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు అమెరికా నుండి కాదు…

TELANGANA

ఆరు గ్యారంటీల ఫైలుపై రేవంత్ తొలి సంతకం-రజనీకి ఉద్యోగమిస్తూ రెండో సంతకం..

ఇవాళ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన రెండు కీలక ఫైళ్లపై సంతకాలు చేసారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన రెండు హామీలపై ఆయన ఈ సంతకాలు చేశారు. దీంతో ప్రమాణస్వీకార వేదిక అయిన ఎల్బీ స్డేడియంలో హర్ష్వధ్వానాలు మిన్నంటాయి.   తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే…

TELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. దీంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమంలో కొత్త అధ్యాయానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.   ఆ తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. భట్టి విక్రమార్క , ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్‌బాబు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్,…

TELANGANA

మంత్రులకు శాఖల ఖరారు – నేడే తొలి మంత్రివర్గ భేటీ..!!

తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాఖల ఎంపిక పైన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 11 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక..మిగిలిన 10 మందికి శాఖల కేటాయింపు పైన స్పష్టత వచ్చింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఇక, తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది.   శాఖలు కేటాయింపు : తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన…

CINEMA

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా డీప్ ఫేక్ వీడియో వైరల్ …

దేశవ్యాప్తంగా డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత, కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్ ల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ బారిన పడ్డారు.   ప్రియాంక చోప్రా కి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్…

AP

చంద్రబాబుతో పవన్ భేటీ, కీలక మలుపు – ఢిల్లీకి ప్రయాణం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఇటు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. ఏపీలో ఎన్నికల కార్యాచరణ పైన చర్చించారు. చంద్రబాబు – పవన్ కలిసి జిల్లా సభల్లో పాల్గొనటం..మేనిఫెస్టో..సీట్ల ఖరారు పైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పైన చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు.   కొత్త సమీకరణాలు :…

AP

ఏపీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు- ఈనెల 22, 23న రాష్ట్రంలో టూర్-రాజకీయ పార్టీలతో భేటీ..

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఏపీతో పాటు వచ్చే ఏడాది పెండింగ్ లో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏపీలో ఈ నెలలో రెండు రోజుల పాటు పర్యటించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియపై భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలో ఈసీ టూర్ ఖరారైంది.     ఏపీలో…