Editor

TELANGANA

గజ్వేల్‌లో కేసీఆర్ బాధితులే నా ఓటుబ్యాంకు : ఈటల రాజేందర్

తెలంగాణ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా ఢీకనబోయే నేతలలో ఒకరైన ఈటల రాజేందర్(Eetala Rajender) ఒకరు. కేసీఆర్ పోటీచేయబోయే గజ్వేల్ నుంచి బీజేపీ తరపున ఈటల బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.   ఈ సందర్భంగా ఆయన గజ్వేల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. “పదేళ్లలో కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలు గుర్తు రాలేదు.. కేవలం ఎన్నికల ముందు గుర్తొస్తున్నారు. నేను ఇక్కడ పోటీ చేస్తున్నాని తెలియగానే బీఆర్ఎస్(BRS) నేతల గుండెల్లో…

TELANGANA

కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే సింగరేణి నష్టాలు.. హస్తానికి ఓటు వేస్తే 60 ఏళ్లు వెనక్కి : సీఎం కేసీఆర్ .

సింగరేణి (Singareni) సంస్థకు నష్టాలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి లాభాలబాట పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.   సీఎం కేసీఆర్ ఆ సభలో మాట్లాడుతూ.. “సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిని కేంద్రం చేతిలో పెట్టాయి. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించి.. సంస్థ నష్టాల్లో…

CINEMA

గోపీచంద్ – శ్రీనువైట్ల మూవీలో విలన్ గా స్టార్ హీరో..!

టాలీవుడ్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల వీరిద్దరూ ప్లాప్ లో ఉన్నారు. దీంతో అటు డైరెక్టర్ ఇటు గోపీచంద్ ఇద్దరికీ కూడా సక్సెస్ కావాలి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చిత్ర బృందం భావించగా ఈ సినిమాలో విలన్ గా తమిళ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో అయిన మాధవన్ తీసుకున్నట్లు సమాచారం.ఈ విషయంపై మేకర్స్…

National

మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్: ప్రధాని మోడీ..

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మార్చి 2020…

AP

పార్వేట మంటపం చుట్టూ ఏపీ రాజకీయం.. ముదురుతున్న వివాదం..

తిరుపతిలో టీటీడీ వర్సెస్‌ బీజేపీ వ్యవహారం మరింత ముదురుతోంది. పార్వేట మండపం చుట్టూ జరుగుతున్న వివాదంపై సవాళ్లు ప్రతిసవాళ్లతో ఈ రగడ మరింత రాజుకుంటోంది. ధైర్యం ఉంటే పార్వేటి మండపం వద్దకు వచ్చి నిర్మాణం బాగాలేదని చెప్పగలరా అంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించారు బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి. మంటపంపై చర్చకు సిద్ధమన్న ఆయన.. అందుకు సమయం, తేదీ చెబితే ఆర్కాలజీ అధికారులతో సహా అన్ని ఆధారాలతో వస్తామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ తీరుపై…

TELANGANA

“కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది”.. కాళేశ్వరం అవినీతిపై రేవంత్ ధ్వజం..

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి.. దానిపై వాస్తవాల గురించి మాట్లాడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు . అంచనాలను పెంచి దోపిడీ చేశారని మంత్రి కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. నిపుణుల నివేదికను సీఎం కేసీఆర్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికి తానే కర్త,కర్మ,క్రియ అని చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోగానే ఆ నెపాన్ని సాంకేతిక నిపుణుల మీదికి తోసేందుకు ప్రయత్నిస్తున్నారని…

TELANGANA

బీఆర్ఎస్ గెలుపు కోసమే ఆ స్థానం నుంచి ఎంఐఎం పోటీ..!

తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలలో మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) కూడా ఒకటి. జాతీయస్థాయిలో పాపులారిటీ ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ పార్టీకి నాయకుడు. ముస్లిం, మైనారిటీల సమస్యలపై ప్రశ్నిస్తూ ఎంఐఎం తెలంగాణతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా పలు రాష్ట్రాల ఎన్నికలలో కూడా పోటీచేస్తోంది.   మరి జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న ఎంఐఎం పార్టీ సొంత రాష్ట్రమైన తెలంగాణ ఎన్నికలు వచ్చేసరికి ఎప్పుడూ పాతబస్తీ(ఓల్డ్ సిటీ)లోని కేవలం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీచేస్తుంది. కారణం…

CINEMA

మెగా బ్రదర్స్ బంధం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మెగా కుటుంబం ఏ ఫంక్షన్ అయినా కలిసికట్టుగా ఎంతో పద్ధతిగా జరుపుకుంటారు అనే విషయం ఈ పెళ్లి ద్వారా మరొకసారి అందరికీ అర్థమైంది. అనారోగ్య కారణం వల్ల మెగాస్టార్ తల్లి అంజనాదేవి మాత్రమే పెళ్లికి హాజరు కాలేకపోయారు. మిగిలిన కుటుంబ సభ్యులు మొత్తం ఇటలీకి తరలివచ్చారు. ఇక పెళ్లి వేడుకలలో మెగా వారి బట్టల దగ్గర…

TELANGANA

మేడిగడ్డ అందుకే కుంగిందా ? NDSA సంచలన రిపోర్ట్…

కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డొల్లేనా? ఆ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపం ఉందా? అని మొదటి నుంచి వస్తున్న అనుమానాలే నిజమయ్యాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఫోకస్ చేసిన అథారిటీ.. ఆ బ్యారేజ్ ప్లానింగ్‌కు, డిజైన్‌కు తేడా ఉందని గుర్తించింది. నిర్మాణంలో వాడిన మెటీరియల్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ వరకు అడుగడుగునా లోపాలు ఉన్నాయి. 16, 17, 19, 20 పిల్లర్లలో పగుళ్లు ఉన్నాయని గుర్తించిన…

TELANGANA

ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీలో 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2018 ఎన్నికల్లో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలిచింది. ఆ ఏడు సిట్టింగ్‌ స్థానాల్లో తిరిగి పోటీ చేస్తోంది. మరో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ వెల్లడించారు.   చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్ , మలక్ పేట ఎంఐఎం సిట్టింగ్ స్థానాలు. వీటితోపాటు…