Editor

CINEMA

తన కుమార్తెతోపాటు తాను కూడా చనిపోయానని సినీ నటుడు విజయ్ ఆంటోనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

చెన్నై: తన కుమార్తెతోపాటు తాను కూడా చనిపోయానని సినీ నటుడు విజయ్ ఆంటోనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె(16) ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చెన్నైలోని తమ నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్టు చేశారు. తన కుమార్తెతోపాటు తానూ చనిపోయానని భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పని ఆమె పేరున చేస్తానని.. దీంతో…

National

గరుడసేవకు భారీ బందోబస్తే, వేల సంఖ్యలో సీసీటీవీలు, 2 లక్షల మంది !

కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి (ttd) కొలువు తీరిన తిరుమలలో (tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) భాగంగా సెప్టెంబరు 22న శుక్రవారం జరుగనున్న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో (tirumala)వేచి ఉండే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. గరుడ సేవ దర్శనం కోసం (tirumala)ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌…

National

జనగణన, డీలిమిటేషన్ అప్పుడే: మహిళా బిల్లుపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పలు పార్టీలు రాజకీయాలు చేశాయని.. కానీ, బీజేపీ, నరేంద్ర మోడీకి అలా కాదని అన్నారు. మహిళలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పారు. జనగణన, డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు పట్టుబట్టడంపైనా అమిత్ షా స్పందించారు. వచ్చే(2024) సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో జనాభా…

National

పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది

న్యూఢిల్లీ: పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు(women’s reservation bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. నారీ శక్తి అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ బిల్లుపై దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం బుధవారం రాత్రి న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 454 మంది…

CINEMANational

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హీరో విశాల్..

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఇలా జరిగిందంటే తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని, తలుచుకుంటేనే భయమేస్తుందని హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా మార్క్ ఆంటోనీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో విశాల్ చంద్రబాబు అరెస్టు గురించి…

APNational

ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్ధన అలంకారంలో శ్రీ మలయప్ప !

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు తిరుమలలో ఉదయం, రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు. తిరుమల మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరగుతున్న వాహన సేవలు కళ్లారా చూడటానికి వేలాది మంధి భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన…

National

రూ.50 కోట్ల లోన్ ఫ్రాడ్: సౌమ్య పట్నాయక్ సంబాద్ పత్రికపై ఈవోడబ్ల్యూ అధికారుల దాడులు

భువనేశ్వర్: మీడియా బారన్ సౌమ్య రంజన్ పట్నాయక్ యాజమాన్యం, సంపాదకత్వంలో ఉన్న ఒడియా వార్తాపత్రిక సంబాద్ రూ. 50 కోట్ల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. వివిధ బ్యాంకుల నుంచి కనీసం రూ. 50 కోట్ల రుణం తీసుకున్న ఈ సంస్థ.. “నిశ్చయంగా వ్యవస్థీకృత రుణ కుంభకోణం” నడిపిందని ఒడిశా పోలీసు ఆర్థిక నేరాల విభాగం(EOW) పేర్కొంది . సంస్థ ఉద్యోగుల నకిలీ వేతన ధృవీకరణ పత్రాలను ఉపయోగించినట్లు తెలిపింది. ఈఓడబ్ల్యూ.. సంబాద్ కార్యాలయంలో సోమవారం సోదాలు…

National

15 రోజుల పాటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం డిసైడ్

మండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్ (కేఆర్ఎస్) నుంచి వచ్చే 15 రోజుల పాటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మంగళవారం తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేసింది. సోమవారం రాత్రి నుంచే నీటి విడుదల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.   సెప్టెంబరు 13 నుంచి అమలులోకి వచ్చే 15 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటకను ఆదేశించడంతో…

CINEMA

మహేష్ బాబు మరో ‘భోళాశంకర్’!

వరుసగా వచ్చే పరాజయాలు హీరోలు, దర్శకులకే కాదు.. నిర్మాతల ఇమేజ్ కూడా మసకబారేలా చేస్తాయి. అనిల్ సుంకర కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే వున్నారు. దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి నిర్మాత అనిల్. భారీ చిత్రాలకు చిరునామాగా ఉండేవారు. అయితే ఆయనకు వరుసగా అపజయాలు చుట్టుముట్టాయి. రాజేష్ దండాతో కలసి చిన్న సినిమా సామజవరగమనా తీయగా మంచి హిట్ అయింది. ఆయన సొంత బ్యానర్ నుంచి వచ్చిన ఏజంట్, భోళా శంకర్ డిజాస్టర్స్ గా మిగిలాయి.…

National

నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ సోమవారం చారిత్రక ప్రకటన చేసింది.   మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.   ఈ బిల్లు ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు.…