Editor

TELANGANA

బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్….

పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహనిర్బంధాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఆయన ‘పిరికిపంద చర్యలు’గా అభివర్ణించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి…

AP

ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాదులోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మావిగన్’ వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని, ప్రముఖ పాత్రికేయుడు రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో…

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… తిరిగి ప్రారంభమైన ‘ఎన్టీఆర్ వైద్య సేవ..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) తమ సమ్మెను విరమించుకుంది. దీంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.   ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే సమ్మె విరమించినట్లు ‘ఆషా’ ప్రతినిధులు తెలిపారు. మొత్తం బకాయిల్లో భాగంగా రూ.1,000 కోట్లను 10 రోజుల్లో చెల్లించేందుకు…

National

ఎల్పీజీ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన..!

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగానే అదనపు గ్యాస్ కార్గోలను సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో ఎక్కడా అంతరాయం కలగకుండా చమురు సంస్థల ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ సాగిస్తున్నారు. గత రెండు రోజులుగా అధికారులు స్వయంగా డిస్ట్రిబ్యూషన్…

TELANGANA

2034 వరకు నేనే .. అందరి లెక్కలు తేలుస్తా.. ఆదిలాబాద్ గడ్డపై రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్..

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్యాన్ని వీడి, ఆదిలాబాద్‌ను పారిశ్రామిక, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.   గత పాలనలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి, అంచనాలు పెంచి వేల కోట్లు వృధా చేశారని, కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని సీఎం విమర్శించారు.…

TELANGANA

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉత్కంఠ..! రేపే కోర్టు తీర్పు..

మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత శర్మల భవితవ్యంపై ఉప్పరపల్లి కోర్టులో కీలక వాదనలు ముగిశాయి. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్.. తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న…

AP

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ముహూర్తం ఖరారు..! ఎప్పుడంటే..?

ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలతో ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం . ఇప్పటికే ఆర్సెలార్‌ మిట్టల్-నిప్పన్‌ స్టీల్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది. అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు గూగుల్ వంతు అయ్యింది. గూగుల్ డేటా సెంటర్‌కు సంబంధించి పునాదిరాయి ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.   విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు   ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చకున్న సంస్థలు ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తోంది…

AP

అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర..

అమరావతి రాజధాని రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించి, చట్టబద్ధత లభించిన శుభతరుణంలో రాజధాని ప్రాంత మహిళలు తమ భక్తిని, కృతజ్ఞతను చాటుకున్నారు. తమ కలల రాజధాని సాకారం కావాలని ఇన్నాళ్లూ పట్టువదలని దీక్ష చేసిన మహిళా రైతులు, నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి ఆశయం నెరవేరినందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, రాజధాని గ్రామాల నుండి కాలినడకన బయలుదేరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.   కాలి నడకన కనకదుర్గమ్మ చెంతకు..…

AP

పుట్టపర్తి విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన స్వాగతం: మర్యాదపూర్వక భేటీ

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ (జేసీ), జిల్లా ఎస్పీ మరియు ఆర్డీవో తదితర అధికారులు గవర్నర్‌ను మర్యాదపూర్వకగా కలిసి పూల బొకేలను అందజేశారు. అధికారులు గవర్నర్‌కు సాదరంగా ఆహ్వానం పలుకుతూ, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం. ఈ మర్యాదపూర్వక భేటీ అనంతరం గవర్నర్…

AP

వేంపల్లి వద్ద తప్పిన పెను ప్రమాదం: ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ తీగలు!

వైయస్సార్ కడప జిల్లా వేంపల్లి గండి వీరన్న గట్టుపల్లి సమీపమున తలుపుల మీదగా కడపకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తున్న ఆర్టిసి బస్సు పై విద్యుత్ తీగలు అకస్మాత్తుగా బస్సు టాప్ పైన పడడంతో చాకచక్కంగా వ్యవహరించిన డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులు బస్సు నుంచి దిగడంతో డ్రైవర్, కండక్టర్ కు ప్రయాణికులకు ఎవరికి ఏం కాలేదని తెలిసింది.