ఖదిరి క్షేత్రంలో రథసప్తమి సంబరాలు: సూర్యప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహుడు
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కదిరి పుణ్యక్షేత్రం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. సూర్యనారాయణ మూర్తిగా ఖాద్రీశుడు లోకానికి వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణుడు. రథసప్తమి రోజున శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు సాక్షాత్తు ఆ శ్రీ సూర్య నారాయణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానానికి మరియు ఆరోగ్యానికి ప్రతీకగా స్వామి వారిని ఆరాధించడం ఈ రోజు ప్రత్యేకత. వైభవంగా సూర్య ప్రభ వాహన సేవ అత్యంత మనోహరంగా అలంకరించిన సూర్య ప్రభ వాహనంపై జగన్నాటక…

