నివాస స్థలాల కోసం కవిత భూ పోరాటం: కరీంనగర్లో ఉద్యమకారులతో కలిసి ఆందోళన!
తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికీ 250 గజాల నివాస స్థలాన్ని అందిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కరీంనగర్ జిల్లాలో ఆమె “భూ పోరాటం” ప్రారంభించారు. అంతకుముందు అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత, అనంతరం మానకొండూరు సమీపంలో భూ పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న…

