అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థినుల మృతి!
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు కాలిఫోర్నియాలో జరిగిన ఒక భయంకరమైన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన కడియాల భావన, మేఘనలుగా గుర్తించారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఈ యువతులు మరణించడంతో వారి కుటుంబాల్లో మరియు గార్ల గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. భావి భారతం కోసం కలలు కంటూ విదేశాలకు వెళ్ళిన తమ పిల్లలు ఇలా శవాలై తిరిగి వస్తున్నారన్న వార్త…

