Editor

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్‌పై కేసీఆర్ ఘాటు లేఖ – న్యాయపరమైన అంశాలతో 6 పేజీల సమాధానం!

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తన నందినగర్ నివాసం గోడకు నోటీసులు అతికించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిట్ (SIT) అధికారులకు 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే నోటీసులను ఇలా బహిరంగంగా గోడకు అతికించడం చట్టవిరుద్ధమని, ఇది తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన మండిపడ్డారు. పోలీసుల ఈ చర్య…

CINEMA

ప్రభాస్-మారుతి కాంబోలో మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హారర్ ఫాంటసీ కామెడీగా వచ్చిన ఈ చిత్రం రెబల్ స్టార్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోవడంతో, దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ మారుతికి మరో అవకాశం ఇచ్చారని, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ పుకార్లపై ప్రభాస్ టీమ్…

AP

కదిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై చిరుత సంచారం: భక్తుల్లో నెలకొన్న భయాందోళనలు

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై చిరుతపులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా కొండ పరిసర ప్రాంతాల్లో చిరుత అడుగుజాడలు కనిపిస్తుండటంతో, అటు భక్తులు ఇటు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కొండపైకి వెళ్లే దారిలో చిరుత సంచారాన్ని గమనించిన కొందరు భక్తులు అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొండపైకి వెళ్లే…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె. రమ పదవీ విరమణ

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కే రమా గారు పదవి విరమణ చెందారు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న శ్రీమతి కే రమా గారు ఈ రోజు అనగా 31-01-2026 న పదవి విరమణ పొందినారు. కె రమా గారు 1989లో అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అసోసియేట్ లెక్చరర్ గా విధుల్లో చేరారు.అప్పటి నుంచి ఎన్నో వేలమంది విద్యార్థులు ను ఉన్నత స్థానాలకు తీర్చి దిద్ది వారి…

AP

అంబటి వ్యాఖ్యలపై కదిరి ఎమ్మెల్యే కందికుంట ఆగ్రహం: చంద్రబాబును దూషిస్తే ప్రకృతి కూడా క్షమించదు!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాట్ కామెంట్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను వ్యక్తిగతంగా అంబటి రాంబాబు దూషించిన విధానం పకృతి కూడా వదలదు  రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుది ఒక రికార్డ్  తెలుగు రాష్ట్రాలలో ఆయన పోషించిన వారే అన్ని పార్టీలలో ఉన్నారు  అంతటి గొప్ప నేత చంద్రబాబును అరగంట ఆంబోతు రాంబాబు తిట్టడం సిగ్గుచేటు  గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు చంద్రబాబును…

TELANGANA

సీపీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. భగ్గుమన్న ఐపీఎస్, ఐఏఎస్, పోలీస్ సంఘాలు..

కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలంను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐపీఎస్ అధికారుల సంఘం, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించాయి. ఎమ్మెల్యే తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కమిషనర్‌కు, ఇతర పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.   అసలేం జరిగింది?   గురువారం హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…

TELANGANA

కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు… ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న విజ్ఞప్తి తిరస్కరణ..

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా, హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరపనున్నట్లు సిట్ స్పష్టం చేసింది.   ఇటీవల గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా, మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు…

AP

ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ..!

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు బిట్స్ పిలానీ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటైన బిట్స్ పిలానీ అమరావతిలో ఆధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.   ఈ ప్రాజెక్టు కోసం తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 70 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమికి సంబంధించిన…

AP

టీటీడీ కీలక నిర్ణయం..!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బయట మార్కెట్ ధరలతో పోలిస్తే టీటీడీ డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎగబడటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్‌ను మూసివేశారు.   గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే, టీటీడీ నిబంధనల ప్రకారం డాలర్ల ధరలను వారానికి ఒకసారి…

National

ముడి చమురు రాజకీయం.. రష్యాకు భారత్ దూరం..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ భారీ డిస్కౌంట్లకు రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై గతేడాది మార్చిలో భారీగా సుంకాలు విధించింది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడటంతో, న్యూఢిల్లీ ఇప్పుడు తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది.   గత జనవరిలో రోజుకు 12 లక్షల బారెళ్లుగా ఉన్న…