Editor

NationalSPORTS

భారత్-పాక్ మ్యాచ్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న శ్రీలంక‌..

టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ అనూహ్యంగా తొలగించింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. భద్రతా కారణాల రీత్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చుతూ, ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.   భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ ప్రాథమిక దశలోని నాలుగు మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. అయితే, భారత్‌లో భద్రతపై ఆందోళన…

AP

అరవ శ్రీధర్ మరొక కొత్త వీడియో..!

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? ఆయనకు సంబంధించి రోజుకో కొత్త వీడియో వెలుగులోకి వస్తోందా? ఈ యవ్వారం వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారా? జరుగుతున్న పరిణామాలపై జనసేన పార్టీ ఏమంటోంది? ఇంతకీ కొత్త వీడియోలో వచ్చిన అసలు మేటరేంటి?   అరవ శ్రీధర్ మరొక కొత్త వీడియో   రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన్ని ఎవరో టార్గెట్ చేసినట్టు…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను టార్గెట్‌ చేశారు: చెవిరెడ్డి..!

మద్యం అక్రమాల కేసులో అరెస్టయిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం రాత్రి ఆయన విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వెంకటేశ్ నాయుడు (226 రోజుల తర్వాత), సజ్జల శ్రీధర్‌రెడ్డి (280 రోజుల తర్వాత) కూడా విడుదలయ్యారు.   జైలు నుంచి బయటకు రాగానే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్… కేసీఆర్ అభ్యర్థనకు అంగీకరించిన సిట్..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేనన్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అంగీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం కేసీఆర్‌కు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ లేవనెత్తిన పలు అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకోనుంది.   న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం తదుపరి తేదీ, విచారణ చేసే ప్రాంతాన్ని పేర్కొంటూ సిట్ మరోసారి నోటీసులు జారీ చేయనుంది.…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..! కార‌ణ‌మిదే..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఆయనపై 126 (2), 132, 196, 299 బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.   వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. గురువారం ఈ జాతరకు ఎమ్మెల్యే…

APNationalTELANGANA

ఆధార్ సేవలపై కీలక అప్డేట్..! ఇకపై ఇంట్లోనే..!

ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుంచే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.   గతంలో ఉన్న mAadhaar యాప్ కంటే…

TELANGANA

గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ మీద చెప్పే అబద్ధం అదే: కేటీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్ధం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని వారు చెబుతున్నారని, కానీ పార్లమెంటులో బీజేపీ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందని అన్నారు.   కేసీఆర్ హయాంలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని తేలిందని, అందులో కేసీఆర్ గద్దెను ఎక్కే…

TELANGANA

ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం ఒక్కసారిగా ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.   మున్సిపల్ పోరులో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలాఖరుకు స్వదేశానికి చేరుకోనున్నారు. అభ్యర్థుల ఉపసంహరణ…

AP

నెయ్యిలో జంతు కొవ్వు కలిపారా? లేదా? తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్..!

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి సిట్ (SIT) దాఖలు చేసిన చార్జిషీట్‌లోని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి   భారీ కుట్ర తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాలో జరిగిన అక్రమాలపై సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ నెట్‌వర్క్‌లో 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డెయిరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, హవాలా మధ్యవర్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.…

AP

జనసేన ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్..!

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే విప్ అరవ శ్రీధర్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని వీడియో కాల్ దృశ్యాలు, వాట్సాప్ చాట్‌లను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించింది.   ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని తెలుస్తోంది.…