4news HD TV

National

కర్ణాటక సరిహద్దులు బంద్, ఎంతకైనా సరే అంటున్న వాటల్, డేట్ కూడా ఫిక్స్, ప్రజలు!

బెంగళూరు/చెన్నై: కావేరీ నదీ (cauvery) జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అక్టోబర్ 10వ తేదీన కర్ణాటక-తమిళనాడు (tamil nadu) సరిహద్దుల్లో బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు కన్నడ సమాఖ్య అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ తెలిపారు. మద్దూరు పట్టణంలోని సంజయ్‌ సినిమా సమీపంలోని కావేరీ కాలువల నుంచి నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు.   బెంగళూరు నుంచి కన్నడ పోరాట సంఘాల నాయకులు…

TELANGANA

తెలంగాణలో క్లియర్ `పిక్చర్`: ఆ పార్టీదే అధికారం: లేటెస్ట్ రిపోర్ట్

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార…

National

అన్నామలైకి ఏమైయ్యింది ?, డాక్టర్లు, ఢిల్లీ ఆదేశాలతో విశ్రాంతి, పాదయాత్రకు బ్రేకులు, అధికారం!

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించి అన్నాడీఎంకే (dmk)పార్టీ ఎన్ డీఏకి దూరం కావడానికి కారణం అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై (Annamalai) ఇప్పటికే పాదయాత్ర (padayatra) నిర్వహిస్తున్నారు. ఎన్ మన్, ఎన్ మక్కల్ అనే పేరుతో ఇప్పటికే మూడు దశల పాదయాత్రను (Annamalai) పూర్తి చేసుకున్నారు. దాదాపు 5 నెలల పాటు సాగే ఈ మహా పాదయాత్ర తమిళనాడులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పాదయాత్ర, పార్టీ…

APNational

రూపాయి పావలా ప్రభుత్వం; చచ్చు తెలివితేటలు, కులరాజకీయాలు: భగ్గుమన్న పవన్ కళ్యాణ్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు పెడనలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగింది. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే వైసీపీ పథకాలను తీసుకొస్తుందని, అమలుకు వచ్చేసరికి అంతా డొల్లతనం మాత్రమే కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసిపిని గద్దె దించడం…

National

స్టార్ హోటల్ లో ఉద్యోగం, అందమైన అబ్బాయిలు టార్గెట్, సోషల్ మీడియాలో వీడియోలు!

బెంగళూరు//హుబ్బళి: మైనర్ పిల్లలకు డబ్బులు, స్వీట్లు ఇస్తానని నమ్మించి వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ వికృత కామాంధుడిని స్థానికులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని హుబ్బళి ( hubbali) నగరంలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన నిందితుడు హుబ్బళిలోని (hotel) ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు హుబ్బళిలోని సిద్ధలింగేశ్వర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. x నిందితుడి ఇంటి చుట్టుపక్కల ఇళ్లలోని మైనర్ పిల్లలే ఎక్కువగా నివాసం…

CINEMA

ఎన్టీఆర్ స్పందించకపోతే ఏంటీ?: కేంద్రం, రోజాపై బాలకృష్ణ సంచలనం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అయితే, దివంగత ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్…

National

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) అల్లర్ల ఘటన అంశంపై బీజేపీ (bjp), కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) అల్లర్ల ఘటన అంశంపై బీజేపీ (bjp), కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఇప్పుడు అదే అస్త్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రయోగిస్తూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk sivakumar) బీజేపీ నేతల ఆరోపణలపై బాంబు పేల్చారు. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) ఘటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ల (congress) మధ్య చిచ్చు రాజుకుంది. ఇంతలో ఇతర ఆరోపణలు…

NationalTELANGANA

హైదరాబాద్‍కు చెందిన మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ లండన్ లో హత్య

హైదరాబాద్‍కు చెందిన మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ లండన్ లో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు రయీస్ ఉద్దీన్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఉద్దీన్ వద్ద ఉన్న నగదు, నగలును దోచుకెళ్లారు. మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ 2011 లో మహమ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అక్టోబర్ 5న కూతురు పెళ్లి ఉండటంతో హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యారు. రయీస్ ను ఉగాండాకు…

AP

ఏపీలో ఎన్నికల అక్రమాల విషయంలో గతంలో వైసీపీ సర్కార్ తో హోరాహోరీ

ఏపీలో ఎన్నికల అక్రమాల విషయంలో గతంలో వైసీపీ సర్కార్ తో హోరాహోరీ పోరాడి, అనంతరం స్ధానిక ఎన్నికల్లో తన పంతం నెగ్గించుకుని మరీ రిటైర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఏపీలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఏర్పాటైన ఓ స్వచ్చంద సంస్ధ తరఫున రీఎంట్రీ ఇచ్చిన నిమ్మగడ్డ తిరిగి ఎన్నికల అక్రమాలపై పోరాటం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ ఎన్నికల ప్రధానాధికారికి నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ…

National

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు

బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఎస్‌ఆర్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సంస్థలు ఇప్పటికే ముందస్తు ఎన్నికల సర్వేలను ప్రచురించడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన అనంతరం రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి…