4news HD TV

National

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణ మహాసంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. తెలంగాణలో ఈసారి విజయం సాధించాలని మొదటి నుంచి భావిస్తున్న కమలనాధులు… సమయం ముంచుకురావడంతో,ఎలా ముందడుగేయాలన్నదానిపై తర్జనభజన పడుతున్నారు.వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో… తెలంగాణలో ఆ ప్రభావం పడిందన్న భావన సర్వత్ర వ్యాపించింది. దీంతో బీజేపీలో చేరికలు ఆగిపోవడం,…

AP

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తూ పరుగులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తూ పరుగులు తీస్తున్నాయి. అయితే ఇందులో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేదని, అటువంటప్పుడు ఎన్నిపేర్లు పెట్టి.. ఎన్నిసార్లు తిప్పినా ఉపయోగం ఏమిటంటూ రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆలోచనలో పడిన భారతీయ రైల్వే సామాన్యుల కోసం వందే సాధారణ్ పేరుతో రైళ్లను తీసుకురావాలని నిర్ణయించుకుంది. చెన్నైలో తయారీ : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి…

AP

ఏపీలో గతంలో అమల్లో ఉన్న సీపీఎస్ ను రద్దు చేసి దాని స్ధానంలో ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీమ్

ఏపీలో గతంలో అమల్లో ఉన్న సీపీఎస్ ను రద్దు చేసి దాని స్ధానంలో ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను తీసుకొచ్చింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదించిన బిల్లును అసెంబ్లీ, మండలిలో ఆమోదించడంతో చట్టంగా కూడా మారింది. అయితే ఏపీ గ్యారంటీ పెన్షన్ చట్టం 2023లో 33 ఏళ్ల సర్వీసుతో రిటైర్మెంట్ చేయించే నిబంధన ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగింది. దీనిపై తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీ గ్యారంటీ పెన్షన్ చట్టం 2023లో 33 ఏళ్ల…

National

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కావేరి జలాల కోసం పోరాటం ఉధృతం

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కావేరి జలాల కోసం పోరాటం ఉధృతంగా మారింది. సెప్టెంబర్ 26 వతేదీన బెంగళూరు బంద్ జరిగింది. రెండు రోజుల గ్యాప్ తో సెప్టెంబర్ 29వ తేదీన కర్ణాటక బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలు మూసివేయబడ్డాయి. ఐటీ (IT) కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది. చాలా కంపెనీలు సగం మంది సిబ్బందితో పని చేయాల్సి వచ్చింది.   కర్ణాటక (Karnataka)బంద్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య లావాదేవీలు…

National

తమిళనాడులో 31 ఏళ్ల నాటి ఓ సంచలన కేసులో మద్రాస్ హైకోర్టు హైకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వె

తమిళనాడులో 31 ఏళ్ల నాటి ఓ సంచలన కేసులో మద్రాస్ హైకోర్టు హైకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని వాచాతిలో 1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల్ని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరందరూ దాఖలు చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించిన హైకోర్టు.. జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో చందనం…

AP

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పీఏగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. చంద్రబాబుకు ముడుపుల అందటంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేసు విచారణ సమయంలో అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికా వెళ్లారు. నోటీసులు ఇచ్చినా తిరిగి రాకపోవటం తో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేసుల విచారణ…

CINEMA

కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్ !

బెంగళూరు: పాన్ ఇండియా యుగంలో కన్నడ సినిమాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది, కేజీఎఫ్ (KGF), కాంతారా సినిమాల (movie) విడుదల తర్వాత బాలీవుడ్ లో కన్నడ సినిమాలు షేక్ చేశాయి. ఈ సందర్భంలో మంచి కన్నడ సినిమాలను పరాయి బాషల వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కేజీఎఫ్-3 గురించి హీరో యశ్ అభిమానులకు ‘హోంబాలే ఫిల్మ్స్’ శుభవార్త అందించింది. కేజీఎఫ్ (KGF) కన్నడిగులకు, కన్నడ…

AP

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షం

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని దక్షిణ రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. వర్షాల తీవ్రత మరో 48 గంటల పాటు ఉండొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం…

National

మేనకాగాంధీకి ఇస్కాన్ 100 కోట్ల పరువునష్టం దావా నోటీసులు..!

దేశవ్యాప్తంగా ఆలయాలతో పాటు గోశాలలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఇస్కాన్..వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతటితో ఆగకుండా నిరాధార ఆరోపణలు చేసినందుకు మేనకాగాంధీకి రూ.100 కోట్ల పరువునష్టం వేస్తామంటూ నోటీసులు పంపింది. ఓ వీడియోలో గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ మేనకాగాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన ఇస్కాన్.. ఇవాళ ఆమెపై…

TELANGANA

బండి సంజయ్ ఇంటి వద్ద బైకర్ల హల్‌చల్- తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార…