4news HD TV

AP

అవినాష్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ వైఖరిపై చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు

దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టిడిపి శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ విద్యుత్ కార్యాలయంలో ఈ మేరకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం…

CINEMA

ఓటర్లకు గిఫ్ట్ కార్డులు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచాను, మాజీ సీఎం కొడుక్కి ఝలక్ !

బెంగళూరు/రామనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వాళ్లు ఓడిపోయారు, ఓడిపోయే వారు గెలిచిపోయారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి రామనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి ఇదే రామనగర నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందు హెచ్ డీ. కుమారస్వామి అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జేడీఎస్ పార్టీకి కంచుకోట…

National

కేజ్రివాల్ కు అండగా కాంగ్రెస్ ? ఢిల్లీ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని నిర్ణయం..

ఢిల్లీలో ఆప్ సర్కార్ కు, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరుకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దీని ప్రకారం హోంశాఖ మినహా మిగిలిన అంశాల్లో ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని తేల్చిచెప్పింది. దీంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అమలుకాకుండా చూసేందుకు కేంద్రం పార్లమెంటులో ఓ బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీలో సేవలపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్…

TELANGANA

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.. క్రమబద్దీకరణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం చెప్పారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా…

National

ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్, దేవుడి మీద కాకుండా డీకే శివకుమార్ మీద ప్రమాణం ?

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, 8 మంది మంత్రులు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం బెంగళూరులోని విధానసౌధలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ. దేశ్ పాండే ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 224 మంది ఎమ్మెల్యేలు విదాన సౌధలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నగిరి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే…

TELANGANA

కెరీర్ లో పురోగతి లేదా? ప్రమోషన్స్ రావట్లేదా? ఈ వాస్తు చిట్కాలు ట్రై చెయ్యండి

చాలామంది కెరీర్లో పురోగతి సాధించడం కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఎన్నో సవాళ్లను అధిగమించి, పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతున్నా కెరీర్లో అనుకున్న స్థానాన్ని పొందలేకపోతారు. కెరీర్లో పురోగతి కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎంత కష్టపడి పని చేసినా ఒక్కో సారి విజయం సాధించడం కష్టంగా మారుతుంది. ఇక అటువంటి వారు సింపుల్ వాస్తు చిట్కాలను పాటిస్తే ఉద్యోగ జీవితంలో దూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మొదట ఉద్యోగం చేసే…

National

బెంగళూరులో కుప్పకూలుతున్న విద్యుత్ స్థంభాలు, కాలిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు !

బెంగళూరు: బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, భారీ గాలుల దెబ్బకు పెద్దపెద్ద చెట్లతో పాటు విద్యుత్ స్థంభాలు నేలమట్టం అవుతున్నాయి. బెంగళూరు సిటీ పరిధిలో బెస్కామ్ కు చెందిన సుమారు 540 విద్యుత్ స్థంభాలు కుప్పకూలడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి, ఏం చెప్పారంటే ! బెంగళూరు సిటీతో పాటు…

TELANGANA

ఇది సారు- కారు-60 పర్సెంట్ కమీషన్ల సర్కార్: బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ కబంధహస్తాల్లో తెలంగాణ రాష్ట్రం చిక్కుకుందని పేర్కొన్న ఆయన, కెసిఆర్ కబంధహస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు. దళిత బంధులో 30 శాతం, ఎమ్మెల్యేల నుండి మరో 30 శాతం సీఎం కుటుంబానికి మొత్తంగా 60 శాతం కమిషన్ గా వెళుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు, భూదందాలలో…

CINEMA

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు మృతి.. అసలేం జరిగిందంటే..!

బుల్లితెర సీరియల్ నటుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు (32) బుల్లితెర నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుకు అయినవారు ఎవరు లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ వచ్చి అక్కడే స్థిరపడ్డారు. టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉండేవాడు. తన నటనతో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు బాలు. ఈ క్రమంలో మే 18న స్నేహితుడి వివాహానికి బైక్‌పై హైదరాబాద్‌…

CINEMA

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సీఎం జగన్ పేరెత్తగానే – నారాయణ మూర్తి వ్యాఖ్యలతో..!!

హైదరాబాద్ వేదికగా ఎన్టీఆర్ శతజయంత వేడుకలు జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇదే సమయంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని పలువురు ముక్త కంఠంతో డిమాండ్ చేసారు. ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే వరకూ పోరాడుతామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సభలో నటుడు ఆర్ నారాయణ మూర్తి ఇదే అంశం పైన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు…