4news HD TV

NationalPOLITICS

పొత్తులపై పవన్ కళ్యాణ్ సూచనలపై బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. నేడు గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు పాల్గొన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసిపి అవినీతిపై మండిపడ్డారు. వైసిపి అవినీతిపై చార్జిషీట్, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అజెండాగా…

National

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తోపాటు మెడ్ ట్రానిక్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు

హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్, సొల్యూషన్స్ సంస్థ అయిన జాప్‌కామ్.. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాప్‌కామ్ సీఈవో కిషోర్ పల్లం రెడ్డి సహా ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ జరిపిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పర్యాటకం, ఆతిథ్యం, ఫిన్‌టెక్,…

National

మహారాష్ట్రలో ఎన్నికల్లో తొలి విజయం; ఖాతా తెరిచిన బీఆర్ఎస్ పార్టీ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కెసిఆర్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. మహారాష్ట్రలోని అంబే లోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గఫూర్ పఠాన్ విజయం సాధించారు. 115 ఓట్ల తేడాతో…

National

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది?

చాలామంది భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు, అరటి పండ్లు, ఆపిల్స్ తదితరాలు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు. అయితే ఏ పండ్లు పెడితే ఎటువంటి ఫలితం వస్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. vastu tips: అప్పుల బాధలు మీకు తగ్గాలా? అయితే ఈ పరిహారాలు చేసి చూడండి!! చాలామంది సహజంగా భగవంతుడికి నైవేద్యంగా పూర్ణ ఫలమైన కొబ్బరికాయను సమర్పిస్తారు. భగవంతుడికి కొబ్బరికాయను…

National

“రూ.2వేల నోటు వెనక్కి” ప్రకటనతో ఆర్బీఐ వెబ్‌సైట్ క్రాష్..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో అసలు విషయం తెలుసుకునేందుకు చాలామంది నెటిజెన్లు ఆర్బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ క్రాష్ అయ్యింది.   రూ.2000 నోట్లు ఇకపై చెలామణిలోకి రావని వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటన చేసింది. అయితే రూ.2000 నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ…

APTELANGANA

జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షలకు అలహాబాద్ హైకోర్టు ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేధించింది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కార్బన్ డేటింగ్ నిర్వహించొద్దంటూ హైకోర్టు తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం…

POLITICS

సిద్దూ సీఎం అని డీకే శివకుమార్ తోనే చెప్పించిన కాంగ్రెస్, స్కెచ్ అంటే అదేనా మేడమ్?

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను ప్రకటిస్తున్నామని స్వయంగా డీకే శివకుమార్ చెప్పడం ఆయన అభిమానులు, ఆయన వర్గంలోని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం రాత్రి సీఎల్ పీ సమావేశం జరిగిన తరువాత కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కర్ణాటకకు కాబోయే సీఎం సిద్దరామయ్య అని ప్రకటించారు. ముచ్చటగా మూడు కారణాలతో సీఎం రేసు నుంచి తప్పుకున్నా, డీకే శివకుమార్ మాటతో! సీఎల్ పీ సమావేశం జరుగుతున్న సమయంలో సిద్దరామయ్య ఏం మాట్లాడుతారు ?, డీకే శివకుమార్ ఏం మాట్లాడుతారు…

National

దిద్దుబాటు చర్యల్లో ప్రధాని మోడీ.. న్యాయ శాఖ సహాయ మంత్రి కూడా ఔట్

సుప్రీంకోర్టుకు, కేంద్ర న్యాయశాఖకు మధ్య చెలరేగిన వివాదం ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు చెడ్డ పేరునే ఆపాదించిందని చెప్పొచ్చు. జడ్జీల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు కూడా చోటు కల్పించాల్సిందేనంటూ కేంద్ర న్యాయశాఖామంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు పదేపదే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పైగా, సుప్రీంకోర్టును శాసించేందుకు ప్రధాని మోడీ సర్కారు ప్రయత్నిస్తుందనే విమర్శలు సైతం వచ్చాయి. అయినప్పటికీ ప్రధాని మోడీ లేదా కేంద్రం హోం మంత్రి అమిత్…

CINEMA

కేవలం 22 మ్యాచ్‌లకే కెరీర్ ఎండ్.. సీన్ కట్ చేస్తే రాజకీయాల్లో సూపర్ హిట్..

చాలా మంది ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే.. అందులో కొందరి ప్లేయర్స్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్ని మ్యాచులు మాత్రమే ఆడి.. టీమిండియా నుంచి ఔట్ అయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కథ కూడా ఇదే. అతను టీమ్ ఇండియా తరఫున 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టీమిండియాలో అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అశోక్ దిండా క్రికెట్ కెరీర్ కథ…

TELANGANA

ఇవేం ఉత్తర్వులు- వివేకా కేసులో తెలంగాణ హైకోర్టు తీరుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం..

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఓవైపు సీబీఐ వరుసగా అరెస్టులు చేస్తూ నిందితుల్ని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో నిందితులు కోర్టుల్ని ఆశ్రయించే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. గతంలో బెయిల్ పై బయటికి వచ్చిన మరికొందరు నిందితుల్ని తిరిగి జైల్లో పెట్టించేందుకు సీబీఐ కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఓ నిర్ణయంపై సుప్రీంకోర్టు సీజే ఆశ్చర్యం వ్యక్తం…