4news HD TV

TELANGANA

హైదరాబాద్ ప్రజలకు మరో వినూత్న సౌకర్యం.!

హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు మరో అద్బుత సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఆకాశంలో నడిచే భావన కలిగేలా నిర్మించిన వంతెనను నగర వాసులకు అందుబాటులోకి తేనుంది నగర పాలక సంస్ధ. జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి…

National

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ చేశారు. లోక్ సభ సభ్యత్వానికి అనర్హత (disqualification)వేటు పడిన కారణంగా ప్రభుత్వం ఆయనను అధికారిక బంగళాను ఖాళీ చేయమన్న విషయం తెలిసిందే. దాంతో, శనివారం ఆయన తుగ్లక్ రోడ్ లోని 12 నెంబర్ బంగళాను ఖాళీ చేశారు. Rahul Gandhi disqualification row: ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు ప్రధాని మోదీ (PM Modi) ఇంటిపేరైన ‘మోదీ’పై అనుచిత వ్యాఖ్యలు…

NationalWorld

సెప్టెంబర్ లో జో బైడెన్ భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ కు రానున్నారు. భారత్ లో సెప్టెంబర్ నెలలో జరిగే జీ 20 (G20) దేశాధినేతల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని అమెరికా ప్రశంసించింది. Joe Biden to visit India: జీ 20 సదస్సు భారత్ జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో భారత్ లో…

National

36 గంటలు.. 8 నగరాలు.. 5300 కిమీలు- ప్రధాని సుడిగాలి పర్యటన

సోమవారం ఉదయం నుంచి 36 గంటల వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 5300 కిలోమీటర్లు ప్రయాణించి, 7 నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.   సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 36 గంటల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సెంట్రల్ ఇండియాలోని మధ్య ప్రదేశ్, దక్షిణాదిన ఉన్న కేరళ, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్ లలో పర్యటిస్తారు. తిరిగి మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు.…

National

అమృత్​ పాల్​ భార్య కిరణ్​దీప్​ కౌర్​ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద టర్నింగ్​ పాయింట్​

ఖలిస్థానీ మద్దతుదారుడు, మత ప్రబోధకుడు అమృత్​ పాల్ సింగ్​​.. పంజాబ్​ పోలీసుల ఎదుటు లొంగిపోయిన వ్యవహారం ఇప్పుడు వార్తలకెక్కింది. పంజాబ్​ మోగాలోని ఓ గురుద్వారాలో ఆదివారం ఉదయం జరిగిన ప్రార్థనల అనంతరం అమృత్​ పాల్​ లొంగిపోయాడు. తాను అక్కడ ఉన్న విషయాన్ని పోలీసులకు ఈ వారిస్​ పంజాబ్​ దే చీఫ్​.. శనివారం రాత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమృత్​ పాల్​ను పట్టుకునేందుకు పంజాబ్​ పోలీసులు చేపట్టిన దాదాపు 40 రోజుల ఆపరేషన్​కు ముగింపు పడింది! ఇన్ని రోజులుగా…

National

152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ

152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మైనింగ్ ఓవర్‌మన్, ఓవర్‌మన్ (మ్యాగజీన్), మెకానికల్ సూపర్‌వైజర్ సహా మరిన్ని పోస్టులకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎన్‍టీపీసీ అధికారిక వెబ్‍సైట్ careers.ntpc.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు మే 5వ తేదీ తుదిగడువుగా ఉంది. వివరాలివే. NTPC Recruitment 2023: పోస్టులు ఇవే మైనింగ్ ఓవర్‌మన్: 84 ఖాళీలు ఓవర్‌మన్ (మ్యాగజీన్): 7 పోస్టులు మెకానికల్ సూపర్‌వైజర్: 22 పోస్టులు…

National

మరోసారి రసవత్తరంగా మహారాష్ట్ర రాజకీయాలు

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల్లోగా కుప్పకూలుతుందని శివసేన (యూబీటీ – ఉద్ధవ్ వర్గం) కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. షిండే సర్కార్‌కు మరణ శాసనం రానుందని జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సంజయ్ అత్యంత సన్నిహితుడు. కొన్ని పిటిషిన్లపై సుప్రీం కోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉండగా.. సంజయ్…

TELANGANA

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటున కూడా ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, సీఎం అయ్యేది మాత్రం కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని…

APNationalTELANGANAWorld

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటు

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేల కోట్లకు సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాడు. ఆదాయమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు. ట్విట్టర్ ని దక్కించుకున్న వెంటనే కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను తీసేశాడు. అలాగే వెరిఫైడ్ అకౌంట్ కోసం డబ్బులు చెల్లించాలన్న నిబంధన తెచ్చాడు. దీంతో చాలా మంది వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ఏడాది చందా లేదా నెల నెలకు చందా…

APTELANGANA

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం.. కానీ అక్కడ అందమైన దేవాలయం.. అందులో లక్ష్మీతో కొలువైన నరసింహాస్వామి.. బొమ్మలతో కూడిన ఇటుకలు.. బుద్ధుని చరిత్ర తెలిపే శిల్పాలు.. ఇలాంటి దేవాలయం కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ తెలంగాణలోనూ 6వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం ఒకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇక్కడి వెళ్లాలంటే సాహసంతో కూడుకున్న పనే. సాధారణ సమయంలో ఇక్కడికి…