4news HD TV

TELANGANA

మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు

మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.. అయితే ఇందులో ఎవరు అధికారం సాధిస్తారు?. ఎవరు ముఖ్యమంత్రి, ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు అనే ప్రశ్నలకు కీలకమైన సమాధానం వచ్చింది. టైమ్స్ నౌ నవభారత్, ఈ టీజీ రీసెర్చ్ సర్వే చేయగా.. పలు ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బిజెపి.. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.. ఓట్ల…

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం గా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ.. తాజాగా వ్యూహం మార్చింది. ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ కు ఓటేస్తే అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని…

APNationalTELANGANA

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపు

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతి, శివందొరవలస గ్రామంలో పార్టి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులైన కామ్రేడ్ చారు మజుందార్,నాగభూషన్ పట్నాయక్ , ఎంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, కొరన్న మంగన్నలకు జోహార్లు పలికి నినాదాలు చేశారు. వారి ఆశయాలను కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 22,…

APCINEMA

తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస.

టాలీవుడ్ లో సినిమా మీద హైప్ తో సంబంధం లేకుండా కేవలం తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస. ఓజి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. రాగానే హరిహర వీరమల్లు పెండింగ్ ఎంతుందో చూసుకుని డేట్లు ప్లాన్ చేసుకుంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ ని మెట్రో స్పీడ్ తో పరుగులు పెట్టించేందుకు హరీష్ శంకర్ సర్వసన్నద్ధంగా ఉన్నాడు. వినోదయ సితం రీమేక్ ఆల్రెడీ షూటింగ్ పూర్తి…

CINEMA

హీరోల కన్నా ప్రేక్షకులు చాలా తెలివి మీరిపోయారు

స్టార్ హీరోలం కాబట్టి మేం ఎలా నటించినా ఎలాంటి సినిమాలు చేసినా వేలంవెర్రిగా ఎగబడి చూస్తారన్న గ్యారెంటీ రోజులు పోయాయి. మొదటి రోజు థియేటర్ కు రావడం అటుంచి అసలు ప్రమోషనే ఆసక్తికరంగా లేనప్పుడు టికెట్లు కొనే సమస్యే లేదని ఆడియన్స్ తేల్చి చెబుతున్నారు. ఆ మధ్య ఆచార్యలో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించారని తెలిసినా కూడా చాలా చోట్ల మార్నింగ్ షోలే ఫుల్ కాలేదు. కారణం క్రేజ్ పడిపోవడం కాదు. పబ్లిసిటీలోనే నీరసం వచ్చే…

AP

టిడిపిలో రాయపాటి టికెట్ల బేరం. చంద్రబాబు ఏం చేస్తారో?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టికెట్ల కోసమని మీడియాతో మాట్లాడుతున్న టిడిపికి,ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆయన తన కొడుకు రంగబాబుకి సత్తెనపల్లి లేదా పెదకూరపాడులోగానీ టికెట్‌ ఇవ్వాలని, అలాగే తన తమ్ముడు కూతురు శైలజకు కూడా తప్పనిసరిగా టికెట్‌ ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని, కానీ వారిద్దరికీ టికెట్స్ ఇస్తే తాను టికెట్‌ కోసం పట్టుబట్టనని టిడిపికి…

AP

వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ రోజుకో ఊహించని మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాకు తీసిపోకుండా సాగుతోంది. తాజాగా వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన తాజా వాంగ్మూలం మొత్తం ఈ కేసు విచారణనే మలుపు తిప్పేలా ఉంది. దానిలో ఆమె తనను వివేకానంద రెడ్డి 2010లో వివాహం చేసుకొన్నారని, మళ్ళీ 2011లో ఇస్లాం మతసాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకొన్నామని తెలిపారు. 2015లో తమకు కుమారుడు జన్మించాడని, అతనికి షెహన్ షా అని…

AP

సిఎం జగన్మోహన్ రెడ్డి అధినేత మొదలు ఆయనకు భజన

సిఎం జగన్మోహన్ రెడ్డి అధినేత మొదలు ఆయనకు భజన చేసే గుడివాడ అమర్నాథ్ వంటి మంత్రులు పదేపదే టిడిపి, జనసేన పార్టీలను “175 సీట్లలో పోటీ చేస్తారా లేదా?ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా లేదా?” అంటూ సవాళ్ళు విసురుతూనే ఉంటారు. సిఎం జగన్మోహన్ రెడ్డి అయితే పొత్తులు పెట్టుకొనేవారందరూ ‘తోడేళ్ళ గుంపు’ అని తాను వాటిని ఒంటరిగా ఎదుర్కొంటున్నానని చెప్పుకొంటూ ప్రజల నుంచి సానుభూతి కోరుకొంటుంటారు! అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకోకూడదని ఎక్కడ ఆంక్షలు…

APTELANGANA

అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

  పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనలు సాగుచేసుకుంటున్న భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎం ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సంఘం లు కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం పెడమరికి పంచాయితీ శివం దొరవలస, చిన మరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కలిసి సమస్యను తెలియజేశారు. గతంలో పట్టణానికి చెందిన మాజీ సైనికడు కి ప్రభుత్వం వారు నిబంధనల…

APNational

రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. .

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షని నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ని సూరత్ కోర్టు కొట్టివేసింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల సూరత్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టలేదని, కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ…