4news HD TV

CINEMA

పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్…

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప చిత్రం సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు… నార్త్ లోనూ ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించారు సుకుమార్. మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో రిలీజ్ చేయగా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ పుష్ప…

CINEMA

సుధీర్ వర్మ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు అనేక ప్రాజెక్ట్ లు ఒకదాని తర్వాత ఒకటి ఒకే చేసి శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా సముద్రఖని తో మొదట షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక నెక్స్ట్ అయితే మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు ఒకే చేయగా వీటితో పాటుగా మరి కొందరు దర్శకులని పవన్ ఓకే చేయాల్సి ఉంది. మరి వారిలో అయితే గత కొంత కాలం నుంచి వినిపిస్తున్న పేరు సుధీర్ వర్మ పేరు…

National

పంజాబ్ లో హై అలర్ట్…

పంజాబ్ లో హై అలర్ట్ నెలకొంది. పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నేత అమృత్ పాల్ సింగ్ కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. అతడిని పట్టుకునేందుకు నిన్న పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పటు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెర్ సర్వీసులను షట్ డౌన్ చేశారు. అమృత్ పాల్…

TELANGANA

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా…

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తుంది. క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 18 నుంచి నిందితులను సిట్ టీమ్ ప్రశ్నిస్తుంది. ఇవాళ రెండో రోజున సిట్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. 2022 అక్టోబర్ నెల నుంచి జరిగిన ఏడు పరీక్షలపై కూడా సిట్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఈ ఏడు పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులపై…

TELANGANA

కేసీఆర్ దళిత ద్రోహి…–: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..

ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సీఎం కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దళిత ద్రోహి అంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి, వర్థంతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించలేదన్నారు. దళిత నియోజకవర్గాల పట్ల కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్…

TELANGANA

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో.. నీహారికకు బెయిల్‌..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రియురాలు నీహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో నిహారిక ఆదివారం జైలు నుంచి బయలకురానుంది. ఈ కేసులో ప్రథాన నిందితుడు హరిహర కృష్ణ ఏ1, అతని స్నేహితుడు హాసన్‌ ఏ2, ప్రియురాలు నీహారిక ఏ3 ముద్దాయిలుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్‌లలోని కీలక సమాచారాన్ని తొలగించినందుకు నిహారిక, హాసన్‌లను పోలీసులు తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత…

AP

అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు–: పవన్ కళ్యాణ్..

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని జనసేన చీఫ్‌ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయంటూ ఒక ప్రకటన విడుదల చేశారు పవన్‌ కల్యాణ్‌. ‘అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు. సందిగ్ధంలో…

APTELANGANA

నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో రాణించాలి…

అల్లాదుర్గం. ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యోగ యువకులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ప్రైవేట్ రంగంలో ప్రవేశించి ఉపాధి పొందవచ్చు అని అల్లాదుర్గం నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు కంచరి బ్రహ్మం అన్నారు. అల్లాదుర్గం అసెంబ్లీ సాధన సమితి ఆధ్వర్యంలో అల్లాదుర్గం ఐబి చౌరస్తాలోని శ్రీవాణి విద్యానిలయంలో శాశ్విత డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని. ఉన్నత…

APHealthNationalTELANGANA

దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల…

దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. 126 రోజలు తర్వాత శనివారం కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. శనివారం ఏకంగా 800 కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే దేశంలో కొత్తగా కరోనా వేరియంట్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ XBB1.16 కేసుల సంఖ్య 76 నమోదు అయ్యాయని INSACOG డేటా వెల్లడించింది. XBB 1.16 వేరియంట్ మొదటిసారి జనవరిలో కనుగొనబడింది. ఫిబ్రవరి నెలలో 59…

AP

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కి షాక్..

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. శాసన మండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరించి విజయకేతనం ఎగురవేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం ఎదురుగాలి వీచింది. టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టంగట్టారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ…