News

AP

కదిరిలో ఆధ్యాత్మిక శోభ: రెండు రోజుల పాటు ‘ఇస్తిమా’ ప్రార్థనలు.. భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రెండు రోజుల ఇస్తిమా(సామూహిక ప్రార్థనలు), భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు. ఇస్లాం పాటించే వారంతా విశ్వాసంతో అల్లాహ్ ను ప్రార్దించాలని, విశ్వాసమే ఇస్లాంకు గీటురాయి అని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని నూతన బైపాస్ రోడ్డు పక్కన శనివారం మధ్యాహ్నం నుంచి ఇస్తెమా ప్రారంభమైంది. పలువురు ముస్లిం మత పెద్దలు బయాన్ (ప్రసంగాలు) చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ పై విశ్వాసం కలిగి…

AP

వేమన స్వామి సన్నిధిలో కదిరి ఈవో వెండి శ్రీనివాస్, పవన్ కుమార్ రెడ్డిలకు ఘన సత్కారం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేమన స్వామి ఆలయాన్ని కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో వెండి శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నేత నంద వేమరెడ్డి ఆధ్వర్యంలో ఈవో వెండి శ్రీనివాస్ మరియు పవన్ కుమార్…

AP

కదిరి వైసీపీ సమన్వయకర్త మాక్బూల్‌ను కలిసిన బెంగళూరు ఐటీ వింగ్ సభ్యులు

కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మాక్బుల్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన IT wing సభ్యులు ఈరోజు బెంగుళూరు ఐటీ వింగ్ విజయ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారిని కలిసి పార్టీ బలోపేతానికి చేయవలసిన తగు సూచనలు సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో ముకుంద రెడ్డి, మురళి రామ్, వెంకటరెడ్డి, కేశవ, వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు

AP

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి: ఎల్సీ (LC) తీసుకోకుండా స్తంభం ఎక్కించడంతో యువ కూలీ మృతి

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి:- విద్యుత్ కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో చోటుచేసుకుంది రాచు వారిపల్లి తాండాకి చెందిన యువకుడు సాయికుమార్ నాయక్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు… పట్నం గ్రామంలో ఎల్ సి తీసుకోకుండానే సాయికుమార్ నాయక్ ను స్తంభం ఎక్కించడం వల్ల ప్రమాదం జరిగి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ…

AP

చెత్త బండిలో మృతదేహం తరలింపు వార్తల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్

పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మరణించిన కె. రాధమ్మ (65) అనే వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనను కొన్ని మాధ్యమాలు కావాలనే వక్రీకరించాయని, వాస్తవానికి అక్కడ ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ నివేదికను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాధమ్మ మరణించిన తర్వాత, మృతదేహాన్ని…

TELANGANA

టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే తోపు: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి నారా భువనేశ్వరి నిర్వహణా దక్షతపై ప్రశంసల జల్లు కురిపించారు. వేలాది మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రస్ట్ కార్యకలాపాల్లో ఆమె చూపిస్తున్న క్రమశిక్షణే సంస్థ అభివృద్ధికి మూలమని ఆయన వెల్లడించారు. ప్రసంగం మధ్యలో…

CINEMA

అనసూయకు ప్రకాష్ రాజ్ మద్దతు: శివాజీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

నటి అనసూయ మరియు నటుడు శివాజీ మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న సోషల్ మీడియా వివాదంపై తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఒక వేదికపై శివాజీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆడవాళ్ల పట్ల శివాజీ వాడిన భాష అత్యంత దారుణంగా ఉందని, అది ఆయన సంస్కారహీనతను మరియు అహంకారాన్ని సూచిస్తోందని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. మహిళల శరీర భాగాల గురించి, వారి వస్త్రధారణ గురించి అసభ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని ప్రకాష్…

TELANGANA

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: లారీ-కారు ఢీకొని దంపతుల మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి-కోరుట్ల జాతీయ రహదారిపై పెద్దగుండు ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని కారులో తిరిగి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్, ఆయన భార్య లావణ్యగా గుర్తించారు. వీరి కుమార్తె…

AP

కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఎస్టి కమిషన్ మెంబర్ వెంకటప్ప పాఠశాలలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ గురుకులం పాఠశాలలో నెలకొన్న సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తాం వందకు వంద శాతం సమస్యలు పరిష్కరిస్తాం కుళ్ళిన కూరగాయలు పురుగులు…

CINEMA

హైదరాబాద్‌లో ‘ది రాజా సాబ్’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు రేపే అసలైన పండుగ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కామెడీ, హారర్ మరియు ఫాంటసీ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం డిసెంబర్ 27న (శనివారం) హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. సాధారణంగా పెద్ద సినిమాల ఈవెంట్‌లను విడుదలకి రెండు…