News

AP

మాజీ మంత్రి కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు .. నేడు కోర్టు ముందుకు..

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను ఈరోజు వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో అరెస్టు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరుకు తీసుకువచ్చారు.   జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన్ను ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. కిలోమీటరు దూరంలోనే అన్ని వాహనాలను నిలుపుదల చేస్తున్నారు.…

AP

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్ట్..

ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కాకాణిని కేరళలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదు అయ్యింది.   అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా గత రెండు నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నారు. కాకాణి గత వైసీీపీ ప్రభుత్వ…

TELANGANA

కవిత కొత్త పార్టీ..?

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. బీఆర్ఎస్ లో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈ తాజా పరిణామాల మధ్య కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన సంచలన లేఖ వైరల్ అయిన తర్వాత కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు గంటన్నర సేపు వీరిద్దరి…

TELANGANA

మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలపై తెలంగాణ సర్కారు సీరియస్… విచారణకు ఆదేశం..

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.   మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు, కొందరు సంపన్న పురుష స్పాన్సర్లను అలరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని మిల్లా మాగీ ఆరోపించారు. ఈ…

National

రూ.840 కే నెలంతా అపరిమిత ఇంటర్నెట్ ఆఫర్ తో స్టార్ లింక్ ఎంట్రీ..!

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సహా ప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆకర్షణీయమైన ప్రణాళికలు రచిస్తున్నాయి. వినియోగదారులను వేగంగా ఆకట్టుకునేందుకు, ప్రారంభంలో నెలకు రూ. 840 రూపాయలకే అపరిమిత డేటా ప్లాన్లను అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతో మధ్య, దీర్ఘకాలంలో సుమారు కోటి మంది వినియోగదారులను చేర్చుకోవాలన్నదే ఈ సంస్థల టార్గెట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధిక స్పెక్ట్రమ్ ఖర్చులను పెద్ద సంఖ్యలో యూజర్లతో భర్తీ చేసుకోవచ్చనే వ్యూహంతో మార్కెట్…

TELANGANA

ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు..!

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఓ శుభవార్త అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు మేలు చేకూర్చే కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చని సమాచారం. ఈ ప్రకటనల్లో భాగంగా ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ కరువు భత్యం (డీఏ)లలో ఒకదానిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.   అంతేకాకుండా, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇతర బకాయిలు, పదవీ…

TELANGANA

హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..! 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు..

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరానికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడనుంది.   కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్…

TELANGANA

ఒక బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు కనిపిస్తే, ఏదో పెను ప్రమాదం జరిగిపోయినట్లుగా చెబుతున్నారు..-: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు నిలకడగా వెలుగులోకి వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు.   హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు కనిపిస్తే, ఏదో పెను ప్రమాదం జరిగిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఘోష్ కమిటీ విచారణ పూర్తయిందని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా నోటీసులు…

National

ఢిల్లీకి పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్..! భారీ ఉగ్రకుట్ర భగ్నం..!

దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. నిఘా సంస్థల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నేరుగా యుద్ధం చేసే సత్తా లేక ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ దాడులు చేయాలనే దాయాది ప్లాన్‌కు చెక్‌ పెట్టాయి భారత నిఘా సంస్థలు. ఈసారి వారి ఎత్తులకు పైఎత్తు వేయడంతో దేశ రాజధానిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇందుకోసం మూడు నెలల పాటు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాయి ఇండియన్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీస్. ఓ పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌తో పాటు.. అతడికి సహకరించిన మరో…

AP

లిక్కర్ స్కామ్.. కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్..!

ఎట్టకేలకు మద్యం కుంభకోణంపై నోరు విప్పారు మాజీ సీఎం జగన్. రేపో మాపో ఆయన అరెస్టు అవుతారన్న వార్తల నేపథ్యంలో వాటిపై ఆసక్తికర స్టేట్‌మెంట్ చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని తేల్చేశారు. ఆయనకు ఆయనే క్లీన్‌చిట్ ఇచ్చుకున్నారు. తప్పంతా చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని ఎదురుదాడి మొదలుపెట్టారు.   భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్షాలు సృష్టించి అరాచకంగా ప్రభుత్వం వ్యవహారి స్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తనను బెదిరిస్తుందని చెబుతూ ఏపీ బేవరేజెస్ మాజీ…