News

TELANGANA

కాళేశ్వరంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: కాంగ్రెస్ కుట్ర వల్లే ప్రాజెక్టుకు నష్టం?

సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడం కోసం ఈ ప్రాజెక్టుపై కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఇసుక మాఫియా కోసం అడ్డుగా ఉన్న చెక్ డ్యాంలను బాంబులు పెట్టి కూల్చేస్తున్నారని మండిపడ్డారు. మానవ నిర్మిత అద్భుత కట్టడాలపై కాంగ్రెస్ ప్రభుత్వం మానవ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులను నాశనం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్…

NationalWorld

చైనాలో భారత ట్రావెల్ వ్లాగర్‌కు చేదు అనుభవం: 15 గంటల పాటు నిర్బంధం!

చైనా అధికారులు భారతీయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మరోసారి వివాదాస్పదమైంది. అరుణాచల్ ప్రదేశ్ అంశంపై గతంలో మాట్లాడినందుకు గాను, భారత ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిత్తల్‌ను చైనాలోని గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలో అధికారులు గంటల తరబడి నిర్బంధించారు. ‘ఆన్ రోడ్ ఇండియా’ పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే అనంత్, ఈ నెల 16న తనకు ఎదురైన భయానక అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇమిగ్రేషన్ సమయంలో తనను పక్కకు తీసుకెళ్లి, దాదాపు 15 గంటల పాటు విచారణ…

AP

కదిరిలో ఘోర రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ సమీపంలోని కుటాగుళ్ళ-పులివెందుల క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కదిరి మండలం కాలసముద్రం గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. గురువారం సాయంత్రం రాజు తన వ్యక్తిగత పని నిమిత్తం వెళ్తుండగా, క్రాస్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా డ్రైవర్ అక్కడి…

AP

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

కదిరి పట్టణం టవర్ క్లాక్ దగ్గర ఉన్న C&IGM మిషన్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

National

బంగ్లాదేశ్‌లో ఆగని హింస: ఢాకాలో బాంబు పేలుడు.. ఒకరి మృతి! అల్లకల్లోలంగా మారిన రాజధాని

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. రాజధాని ఢాకాలో బుధవారం (డిసెంబర్ 24, 2025) సాయంత్రం చోటుచేసుకున్న బాంబు పేలుడు దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఢాకాలోని రద్దీగా ఉండే మోఘబజార్ ప్రాంతంలోని ఫ్లైఓవర్ పైనుంచి గుర్తుతెలియని దుండగులు బాంబు విసిరారు. ఈ పేలుడు ధాటికి ఒక ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే సియామ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఫ్లైఓవర్ కింద ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నం…

TELANGANA

గుర్తు లేని ఎన్నికల్లోనే 4 వేల స్థానాలు గెలిచాం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రేవంత్ సిద్ధమా? – హరీశ్ రావు

తెలంగాణలో పార్టీ గుర్తు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంచనాలకు మించి రాణించిందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విజేతల సన్మాన సభలో పాల్గొన్న ఆయన, కారు గుర్తు లేకపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 4,000 పైగా సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారని వెల్లడించారు. సాధారణంగా అధికార పార్టీ 90 శాతం స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుందని, కానీ కాంగ్రెస్ కేవలం 64 శాతానికే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఇది…

TELANGANA

నన్ను 181 కేసులతో ఇబ్బంది పెట్టారు: కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన

కొడంగల్ వేదికగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తనను రాజకీయంగా అణచివేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తనపై ఏకంగా 181 కేసులు పెట్టారని, అక్రమంగా చంచల్‌గూడ జైలులో బంధించి తన కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనను జైలు పాలు చేసి, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. తాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ…

AP

కదిరిలో గ్యాస్ సిలిండర్ పేలుడు: సర్వం కోల్పోయిన పేద కుటుంబం.. రెక్కల కష్టంతో దాచుకున్న రూ. 2 లక్షలు బుగ్గి!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలువుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామంలోని సుబ్బమ్మ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.గ్యాస్ లీక్ కావడం వల్ల జరిగిన ప్రమాదం. ప్రమాదంలో కాలిపోయిన ఇంట్లోని మొత్తం వస్తువులు.హడావుడిగా చేరుకొని మంటలార్పిన గ్రామస్తులు. కూలి నాలిచ్చేసి కష్టపడి దాచుకున్న రెండు లక్షల రూపాయలు మంటల్లో ఖాళీ బూడిది అవడంతో కన్నీరు మునీరుగా రోదిస్తున్న బాధితురాలు సుబ్బమ్మ భర్త చనిపోవడంతో ముగ్గురు ఆడ పిల్లలతో కష్టపడి జీవనం కొనసాగిస్తున్న కొమ్మెర సుబ్బమ్మ. కనీసం తినడానికి…

AP

“మా అన్న పక్కా జనసేన.. పవన్ కల్యాణ్ అంటే ప్రాణం”: నిందితుడు అజయ్ సోదరి సంచలన వ్యాఖ్యలు!

శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణీపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అజయ్ దేవ్ సోదరి మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలు వెల్లడించారు. తన అన్నకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అజయ్ దేవ్ పక్కా జనసేన పార్టీ మద్దతుదారుడని, పవన్ కళ్యాణ్ అంటే అతనికి అమితమైన అభిమానమని తెలిపారు. ఆ అభిమానంతోనే తన అన్న చేతిపై పవన్ కళ్యాణ్ పేరును టాటూగా కూడా వేయించుకున్నాడని ఆమె ఆధారాలను…

AP

అరుణాచల క్షేత్రంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గిరి ప్రదక్షిణ: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

తమిళనాడులోని అరుణాచల పుణ్యక్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమశివుడ్ని గిరి ప్రదక్షణ చేసి ఆ స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు సలాం బీడీ ఇస్మాయిల్ గారు, కౌన్సిలర్ రంగారెడ్డి గారు.