News

National

దాయాది దేశం ప్రకటన.. సైనిక చర్యకు భారత్ రెడీ..!

పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో అసలైన వణుకు మొదలైందా? భారత్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని భయంతో వణికిపోతుందా? తమ మీద భారత్ దాడి చేయడం ఖాయమని ఎందుకు అంటున్నారు పాక్ మంత్రులు? ఈ లెక్కన ఉగ్రదాడి గురించి వారికి ముందే తెలుసా? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. భారత్ మరో 24 నుండి 36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందన్నారు ఆదేశ సమాచార శాఖమంత్రి అట్టాఉల్లా తారర్. దీనికి సంబంధించి రహస్య సమాచారం…

TELANGANA

కొత్త డీజీపీ..! డీజీపీ రేసులో ఎవరెవరంటే..?

ఇప్పటికే సీఎస్ శాంతికుమారి టర్న్ పూర్తి అయింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజీపీ జితేందర్ రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్ కోసం ప్రభుత్వం కసరత్తు కంప్లీట్ చేసింది.   డీజీపీ రేసులో ఎవరెవరంటే..   డీజీపీ రేసులో 8 మంది సీనియర్ ఐపీఎస్‌లు ఉన్నారు. ఎనిమిది మంది అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. రవి గుప్తా, సీవీ ఆనంద్,…

AP

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ భేటీ.. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని సూచన..!

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయన వారికి సూచించారు. “ఎవరి ఆదేశాలకోసమో మీరు ఎదురు చూడొద్దు, మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ ఛార్జితో కలిసి మొదట కదలాల్సింది జిల్లా అధ్యక్షులే.. రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా లోకల్ గా కార్యక్రమాలు చేయాలి, వాటితో హైలైట్ కావాలి” అని వారికి ఉద్భోదించారు. స్తబ్దుగా ఉన్న జిల్లా పార్టీ శ్రేణుల్లో కదలిక తెచ్చేందుకు జగన్…

AP

సింహాచలంలో చందనోత్సవం వేళ తీవ్ర విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి..!

విశాఖ సిటీలోని సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోక ముందే ఎనిమిది భక్తులు ఈ లోకాన్ని వదిలిపెట్టారు. భక్తులు క్యూ లైన్‌లో ఉండగా సమీపంలోకి గోడ కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.   మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. బస్టాండ్ నుంచి దేవాలయానికి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్…

AP

గ్రూప్ 1లో అక్రమాలు .. పీఎస్ఆర్‌పై మరో కేసు నమోదు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఇదివరకే ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టై ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.   అయితే ఆ సమయంలో గ్రూప్ 1 (2018) ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు…

AP

విశాఖకు త్వరలో గూగుల్… సీఎం చంద్రబాబు ప్రకటన..!

అమరావతిలోని విట్ యూనివర్సిటీలో ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్‌పో’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నూతన భవనాలు ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడారు.   రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు.   విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ,…

National

భారత్ మాపై దాడి చేయడం ఖాయం: పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు..

కశ్మీర్‌లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి తర్వాత ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.   గత వారం ఏప్రిల్ 22న కశ్మీర్‌లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పౌరులపై జరిగిన ఈ దారుణ…

TELANGANA

గ్రూప్-1 పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు రూ. 20,000 చొప్పున జరిమానా..

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ 19 మంది పిటిషనర్లకు రూ.20,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మొత్తం 19 మంది అభ్యర్థులు హైకోర్టును…

AP

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి..!

రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 10 జిల్లాలకు సంబంధించి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్ల నియామకాలను ఖరారు చేశారు.   వివిధ జిల్లాల డీసీసీబీ చైర్మన్లుగా నియమితులైన వారు:   ఈ నియామకాలతో కీలకమైన సహకార రంగ సంస్థలకు కొత్త అధిపతులు వచ్చినట్లయింది. ప్రభుత్వం త్వరలోనే మరిన్ని నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం…

AP

ఏపీ లిక్కర్‌ స్కాం.. సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌..

ఏపీ లిక్కర్ పాలసీలో ట్విస్టులు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. ఎవరెవరికి సంబంధం ఉంది.. మద్యం పాలసీ ఎలా తయారు చేశారు.. ఆర్గనైజ్డ్ గా ముడుపులు ఎలా మళ్లించారు.. కుట్రలకు కేంద్రస్థానం ఏంటి.. సప్లై, సేల్స్ కు ఆఫ్ లైన్ ఎందుకు పెట్టారు.. ఇదంతా దూరం నుంచి చూస్తే ఏమీ అర్థం కాదు. కానీ దగ్గరి నుంచి చూస్తే ఒక్కో లెక్క బయటికొస్తుంది. ఇప్పుడు సిట్ కూడా అదే చేస్తోంది.   తాజాగా ఏపీ లిక్కర్‌ స్కాంలో…