News

AP

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ..

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.   కాగా.. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల…

AP

‘సస్పెన్షన్‌‌ తాత్కాలిక విరామం’.. మళ్లీ వస్తానన్న దువ్వాడ..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీ వైపు వెళ్తారో తెలీదు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు.. ఆపై అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఒకరు. ఆయన మాటలకు అర్థాలు ఎప్పుడూ వేరుగానే ఉంటాయి. దాని లోతుల్లోకి వెళ్తే తప్ప ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు అదే చేస్తున్నారు.   దువ్వాడ రియాక్ట్ వెనుక   దువ్వాడ శ్రీనివాసరావు.. సరిగ్గా ఐదేన్నరేళ్ల…

TELANGANA

అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్….

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో యువతులకు సరైన ఆహారం లేక నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకుంటే వ్యాధులు రావని భావిస్తోంది. దీనికి తోడు మారుతున్న జీవనశైలి, ఆపై ఆహారం అలవాట్లు. ఇవన్నీ టీనేజీ యువతులపై ప్రభావం కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతల కోసం కొత్త స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్.   యువతులకు కొత్త స్కీమ్   తెలంగాణలో…

TELANGANA

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్…

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్. ఇంతకీ భారత్ సమ్మిట్ పేరిట జరగనున్న ఈ కార్యక్రమ సరళి ఎలాంటిది? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఏయే అంశాలపై చర్చ సాగనుంది? దీని అసలు ఉద్దేశమేంటి? ఆ ఫుల్ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.   కాంగ్రెస్ దార్శనికతను అద్దం పట్టేలా.. భారత్ సమ్మిట్ 2025 ఏప్రిల్ 25, 26వ తేదీల్లో హైదరాబాద్ లోని HICCలో నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలీనోద్యమానికి పునాది వేసిన చారిత్రాత్మక బాండుంగ్ సమావేశం…

National

పహల్గామ్‌ ఉగ్రదాడి.. పాక్‌పై భార‌త్ తీసుకున్న ఏడు క‌ఠిన చ‌ర్య‌లివే..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఉగ్ర‌దాడిలో పాకిస్థాన్ హ‌స్తం ఉంద‌ని ఆరోపిస్తూ దాయాది దేశంపై భార‌త్ క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఇప్పటివ‌ర‌కు పాక్‌పై ఏడు చర్యలు తీసుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత భార‌త‌ ప్రభుత్వం బుధ‌వారం ఐదు చర్యలు తీసుకోగా, గురువారం మరో రెండు చర్యలు తీసుకుంది.   పహల్గామ్‌ ఉగ్రవాద దాడి నేప‌థ్యంలో పాక్‌పై భార‌త్‌ తీసుకున్న ఏడు…

TELANGANA

అఘోరీ మెడికల్ టెస్టులో అతి భయంకరమైన విషయాలు….

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపిసోడ్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలుకు చేరింది. చీటింగ్ కేసులో చేవెళ్ల కోర్టు అల్లూరి శ్రీనివాస్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. లెక్క ప్రకారమైతే సంగారెడ్డి సబ్ జైలులో ఉంచాలి అఘోరీని. ముందుగా అఘోరీ సంగారెడ్డి సబ్ జైలుకే తీసుకెళ్లారు. కానీ, అఘోరీ ఆడా? మగా? క్లారిటీ కావాలంటూ అక్కడి జైలు అధికారులు రిజెక్ట్ చేశారు. చేసేది లేక పోలీసులు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు.   వైద్య పరీక్షల్లో…

TELANGANA

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్స్..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ ఇందిరమ్మ ఇళ్లు. దీన్ని పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. ఏ మాత్రం అవకతవకలకు చోటు ఇవ్వకుండా చర్యలు చేపడుతోంది. సమయం తీసుకున్నా, విపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్దిదారుల గుర్తింపునకు ప్లాన్ ప్రకారం వెళ్తోంది.   ఈ క్రమంలో ఈ నెల(ఏప్రిల్) 30లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది. ఈ మేరకు పైస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ…

National

కశ్మీర్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం..!

పహల్‌గామ్ లో దారుణమైన ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఉగ్రవాదులు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికుల్ని టార్గెట్‌గా మారణహోమం సృష్టించడం దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది.   అయితే, పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పాకిస్థాన్ తీరుపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ దేశంలో దౌత్య సంబంధాలను పూర్తి తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని…

AP

లిక్కర్‌ స్కామ్‌‌లో.. చాణక్య అరెస్టు..!

మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రూపొందించిన నెట్వర్క్ నిర్వహణలో.. రాజ్ కెసిరెడ్డి ప్రతినిధిగా కీలకపాత్ర పోషించిన.. బూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ్‌ను సిట్ అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో.. ఎనిమిదో నిందితుడైన చాణక్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందటే చాణక్య దుబాయ్ కి పారిపోయారు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతమవటం, సిట్ అన్ని వైపుల నుంచీ ఉచ్చు బిగించటంతో తప్పించుకునే మార్గం…

AP

బాగోతాలు బయటకు.. ముంబై నటి కేసు.. జైలుకి ఐపీఎస్ ఆంజనేయులు..

తోటి ఉద్యోగులు చేత సెల్యూట్ కొట్టించుకునేవారు.. సార్ అని అందరూ గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు కటకటాల పాలయ్యారు ఆ అధికారి. చాలామంది అధికారులకు ఆయన గుర్తు ఉండే ఉంటుంది సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు. ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో ఆయన గుట్టు అంతా బయట పెట్టేశారు అధికారులు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఆయన, నటి విషయంలో కొందరు ఐపీఎస్ అధికారులను ఎలా ఉపయోగించుకున్నారో కళ్లకు కట్టినట్టు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.…