News

National

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..!

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి ఆరేళ్ల కాలానికి ఈ పథకం 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు.   వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను…

TELANGANA

హస్తినలో ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి సమావేశమయ్యారు.గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్.. 13 అంశాలతో తెలంగాణ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలను కేంద్రం ముందు ఉంచాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల…

TELANGANA

25 వేల మంది ప్రజాప్రతినిధులు అయ్యే వరకు మా పోరాటం ఆగదు!: కవిత..

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ 25 వేల పదవుల్లో సగం మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో కవిత సమావేశమయ్యారు.   ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాల కోసం సబ్…

TELANGANA

కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించారు… బనకచర్లను ఒప్పుకోం: కోమటిరెడ్డి..

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్లను ఒప్పుకునే పరిస్థితే లేదని అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం ఒక్కటే అజెండాగా పెడితే చర్చకు రాలేమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశామని తెలిపారు.   ఇప్పటికే తెలంగాణకు చెందిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ ఏపీకి తరలించుకుపోయారని కోమటిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో గోదావరిపై నాసిక్ లో ప్రాజెక్టు కడిగే…

National

విమాన ఇంజిన్ వైఫల్యాలు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు..

భారతదేశంలో గత ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు తమ విమానాల ఇంజిన్‌లు, ఇంధన స్విచ్‌లు మొదలైన వాటిపై అప్రమత్తమయ్యాయి. ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఒక నివేదికను విడుదల చేసింది.   ఈ నివేదికలో కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. జనవరి…

National

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు ..

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు పేల్చేయబోతున్నట్లు మెయిల్ వచ్చింది.   మెయిల్‌లో బెదిరింపు కామ్రేడ్ పినరయి విజయన్ అనే మెయిల్ ఐడీతో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా గాలించారు. దీనితో వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌, ఫైర్‌ సర్వీసుల బృందాలను రంగంలోకి దింపారు. BSE పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను…

TELANGANA

గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   ‘కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథం వైపు వెళ్తుందని సీఎం అన్నారు. ‘సాయుధ రైతాంగ, రజాకార్ వ్యతిరేక పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

TELANGANA

హైదరాబాద్ శివారులో భారీ భూ కుంభకోణం..! ఎంతంటే..?

800 నుంచి వెయ్యి కోట్ల రూపాయలు విలువచేసే భూముల్ని అత్తగారి సొమ్ములా కొట్టేశారు. హైదరాబాద్ శివారులో మొయినాబాద్‌ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో భూ కుంభకోణం వెలుగు చూసింది. సర్వే నంబరు 180లోని సర్కారు భూమికి యాజమాన్య హక్కులు ఇప్పిస్తామంటూ దళారులు మోసగించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి వెయ్యి కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టు స్పష్టమవుతోంది. మొయినాబాద్ దగ్గర గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో.. ఈ కుంభకోణం బయటపడింది.…

TELANGANA

మాజీ ఇంజనీర్ మురళీధర్‌రావు అరెస్టు..! సోదాల్లో భారీగా ఆస్తులు..

తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు అరెస్టు అయ్యారు. మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మురళీధర్‌రావుకు సంబంధించి బంధువులతోపాటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా పని చేశారు మురళీధర్‌రావు. ఆయన అరెస్టుతో కొందరి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ…

AP

ఏపీలో ఆపరేషన్ గరుడ దూకుడు..! భారీగా కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వ్యాప్తిని నియంత్రించడంలో.. ప్రభుత్వం చేపట్టిన కృషి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించిందని.. హోమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గతంలో ఏపీ గంజాయి హబ్‌గా పేరు గాంచిందని, ఇతర రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడితే అది ఏపీ నుంచే వచ్చినదిగా భావించేవారని ఆమె గుర్తు చేశారు.   ఈ అంశాన్ని సమగ్రంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదనతో.. ‘ఈగల్’ అనే ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. రవికృష్ణను డైరెక్టర్‌గా నియమించి ఈగల్‌ను కార్యాచరణలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం…