ఇరాన్పై యుద్ధంలో ఏఐ ఆయుధాలు రంగంలోకి దించిన అమెరికా..
ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణలో అమెరికా సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన ఈ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అటానమస్ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం నాడు ధృవీకరించారు. పెంటగాన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ ఏఐ సామర్థ్యాలున్న డ్రోన్లు, ఇతర వ్యవస్థలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా వాటి పూర్తి వివరాలను వెల్లడించలేనని స్పష్టం చేశారు. …

