News

TELANGANA

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు రెడీ.. నేటి నుండి పంపిణీ మొదలు..

దశాబ్ద తర్వాత తెలంగాణ వాసుల కల నెరవేరుతోంది. సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి అంతా రెడీ అయ్యింది. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ప్రభుత్వం అధికారులు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రేవంత్ సర్కార్ ఒకొక్కటిగా అమలు చేస్తోంది.   తాజాగా జులై 14న అంటే సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సోమవారం నల్గొండ జిల్లా తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం…

AP

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి..! ఫర్నీచర్ ధ్వంసం..

మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు.   తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తెస్తే.. సంబరాలు చేసుకోవడానికి కవిత ఎవరంటూ ప్రశ్నించారు మల్లన్న. మెదక్ జిల్లాలో జరిగిన సభలో కవితను ఉద్దేశించి ఆయన చేసిన వాఖ్యలపైనే ఇప్పుడు వివాదం రాజుకుంది.   ఫర్నీచర్…

AP

అమరావతిలో ఏఐ క్యాంపస్.. దేశంలోనే మొట్ట మొదటిది..

ఏపీ రాజధాని అమరావతిలో ‘ఏఐ ప్లస్‌ క్యాంపస్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వైస్ ఛాన్సలర్, బిజినెస్‌మేన్ కుమారమంగళం బిర్లా వెల్లడించారు. అక్కడ రానున్న ఐదేళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అమరావతి క్యాంపస్‌ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.   అమరావతిలో ఏర్పాటు చేస్తన్న బిట్స్ ఏఐ ప్లస్‌ క్యాంపస్‌ ప్రవేశాలను మరో రెండేళ్లలో అంటే 2027 నుంచి మొదలుపెడతామని కుమారమంగళం బిర్లా స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్,…

AP

సింగపూర్‌‌కు సీఎం చంద్రబాబు..! సింగపూర్‌లో వ్యాపారవర్గాల బృందంతో భేటీ..!

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో జులై 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఓ టీమ్ అక్కడ పర్యటించనుంది. సింగపూర్‌లో వ్యాపారవర్గాలతో ఈ బృందం సమావేశం కానుంది.   ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. మరో నాలుగేళ్లు మాత్రమే మిగిలివుంది. ప్రస్తుతం రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే బాగుంటుందని ఆలోచన చేశారు సీఎం చంద్రబాబు.…

AP

చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల..

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందని వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నేతలు దాడులు చేస్తే పోలీసులే…

TELANGANA

తెలంగాణలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ..!

తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇదివరకే కొంతమందికి రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసింది.   ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త…

TELANGANA

మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..

తెలంగాణలోని రేవంత్ సర్కార్ మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త అందించింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెర్ప్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది.   మొత్తం రూ.344 కోట్లలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు కేటాయించగా, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించారు. ఈ రోజు (శనివారం) నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు…

National

డ్యూటీలో మహిళా పోలీస్‌లు ఆభరణాలు ధరించడం, మేకప్ వేసుకోవడంపై బీహార్ పోలీసుల నిషేధం..

మహిళా పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నగలు ధరించకూడదని, మేకప్ వేసుకోకూడదని బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాలు జారీచేసింది. దీనిని అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అదనపు డైరెక్టర్ జనరల్ (లా) పంకజ్ దరాద్ సంతకంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.   కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, ముక్కు, చెవులకు రింగులు ధరించడం, గాజులు, ఆభరణాలు ధరించడం, విధుల్లో ఉన్నప్పుడు కాస్మొటిక్స్ ఉపయోగించడంపైనా…

TELANGANA

నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి… వైరల్ గా మారిన ట్వీట్..

ఏపీలో సంచలనం రేకెత్తించిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నారు. గతంలో కేసు విచారణకు హాజరైన విజయసాయిని సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ ఆసక్తికరంగా మారింది.   భగవద్గీతలోని”కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన! మా కర్మఫలహేతుర్భూ: మా తేసంగోஉస్త్వకర్మణి!!” శ్లోకాన్ని ఆయన ట్వీట్ చేశారు.   “కర్మలను…

AP

ఏదైనా చేయాలంటే… చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి.. పేర్ని నాని సంచలన వాఖ్యలు..

‘పుష్ప’ సినిమాలోని ‘రప్పా రప్పా’ డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు, బ్యానర్లలో కనిపించడం… ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెంట నుంచి రావడం రాజకీయాల్లో వేడిని పెంచింది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   మంత్రి నారా లోకేశ్ మాదిరి మీరు కూడా చెడిపోయారా? అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. లోకేశ్…