News

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. రోజుకో విషయం వెలుగులోకి రావడంతో విపక్ష బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై నోరు విప్పేందుకు నేతలు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చారు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్.   ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేటీఆర్. ఫోన్లు ట్యాప్ చేసి హీరోయిన్లను బెదిరించానని ఇటీవల ఓ రాజకీయ నేత మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీ..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ వేగవంతంగా నడుస్తోంది. ఈకేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు(Radhakishan rao) కస్టడీ కోరుతూ.. పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారించింది. రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి 7 రోజుల పాటు రాధాకిషన్‌రావును పోలీసులు ప్రశ్నించనున్నారు.   కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చిన విషయం…

AP

జనసేనకు ఈసీ బిగ్ షాక్..!

రాష్ట్రంలో వేసవి వేడితో పాటు ఎన్నికల వేడి కూడా సెగ పుట్టిస్తోంది. అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా సిద్ధం అంటే సిద్ధం అంటున్నాయి. ప్రచారాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. జనసేన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా గుర్తించింది. ఈ క్రమంలో ఎన్నికల్ కమిషన్ గుర్తింపు పొందిన, గుర్తింపు లేని జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాను విడుదల…

AP

ఏపీలో ఇప్పటి వరకు రూ. 34 కోట్లు సీజ్, 3300 ఎఫ్ఐఆర్​లు: ఈసీ వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకు రూ. 34 కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులు సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రూ. 11 కోట్ల నగదు, రూ. 7 కోట్ల మద్యం, రూ. 10 కోట్ల మేర బంగారం, వెండి ఆభరణాలను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు.   నగదు, మద్యం, వాహనాలు తదితర అంశాలపై 3300 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్టు ఈసీ…

AP

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు సంచలనం..

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న సంజయ్ సింగ్‌ గత ఏడాది అక్టోబర్‌లో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసును…

TELANGANA

కేసీఆర్‌‌కు షాక్.. కల్వకుంట్ల కుటుంబంలో మరొకరు అరెస్ట్..

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.   ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి అన్ని కోణాల నుంచీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అటు వలసలు, ఇటు అరెస్టులు ఆ పార్టీని చుట్టుముట్టాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎంపీలు,…

TELANGANA

మహిళలకు నెలకు రూ.2500.. ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.   అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10…

AP

పవన్ కళ్యాణ్ కు భారీ షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈసారి ఎలాగైనా ఎన్నికలలో విజయం సాధించి ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రయత్నం చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల విజయంతో పాటు, కూటమి విజయం కోసం గతానికి భిన్నంగా వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.   జనసేనకు షాక్.. దిక్కు తోచని స్థితిలో జన సైనికులు ఇక…

AP

ఏపీలో పెన్షన్లు ఇళ్లకే పంపండి-ఈసీకి చంద్రబాబు లేఖ..!

ఏపీలో పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలన్న ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎస్ జవహర్ రెడ్డి.. రాత్రికి క్లారిటీ ఇస్తామని చెప్పినా ప్రకటనేదీ రాలేదు. దీంతో రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పెన్షన్ల పంపిణీని సచివాలయ సిబ్బందితో చేయించాలని కోరుతూ ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు.   సచివాలయ ఉద్యోగులు, ఇతర…

National

కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాతో సహా ఢిల్లీ మద్యంకేసు కీలక నిందితులంతా తీహార్ జైల్లోనే..!!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగి నెల రోజులైంది. వరుసగా తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరాకరించడంతో, ఆయన ఇంటికి వెళ్లి సోదాలు జరిపిన ఈడి అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.   భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఆసక్తికర పరిణామం అని…