News

TELANGANA

విద్యుత్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్..

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు.   గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని సీఎం చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై…

TELANGANA

రూ. 500కే గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాల అమలుకు డేట్ ఫిక్స్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కారు మరో ముందుడు వేసింది. గృహజ్యోతి(200 యూనిట్వ వరకు ఉచిత విద్యుత్), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఫిబ్రవరి 27 లేదా 29న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్సబ్కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.   మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం…

AP

టీడీపీ, జనసేన గెలుస్తాయా : వైసీపీని గెలిపిస్తాయా..!!

ఏపీలో ఎన్నికల సమీరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సీట్ల పైన నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన తమ అభ్యర్దులను ప్రకటించటంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఆసక్తి కర పోరు కొనసాగుతోంది.   సీటు కోసం పోటీ : గోదావరి జిల్లాలో…

AP

వైఎస్ షర్మిల అరెస్టు..

ఏపీలో మెగా డీఎస్సీ స్ధానంలో 6100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా వారు తప్పించుకుని ఉండవల్లి వరకూ వెళ్లారు. దీంతో పోలీసులు షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ…

National

రైతుల నిరసన ఉద్రిక్తతం: కాల్పుల్లో రైతు మృతి, రెండురోజులపాటు ఆందోళనకు బ్రేక్..

కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన క్రమంలో రైతులు ఢిల్లీ చలోకు యత్నించారు. దీంతో పంజాబ్-హర్యానా సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఖనౌరీ సరిహద్దు వద్ద భద్రతా బలగాల చేతిలో ఒకరైతు మరణించినట్లు రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ చలోను రెండు రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధినేత శర్వణ్ సింగ్వెల్లడించారు.   కాగా, అంతకుముందు గురువారం ఉదయం మరోసారి ఢిల్లీ చలో నిరసనకు యత్నించారు. ఈ…

TELANGANA

జనసంద్రంగా మేడారం.. మహాజాతర ప్రారంభం..

మేడారం జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. నేడు, రేపు కూడా భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సారలమ్మ గద్దె మీదకు రానున్నారు. గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకురానున్నారు. మేడారానికి ఇప్పటికే 15 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది.   బుధ, గురువారం ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ రోజు సాయంత్రం కన్నెపల్లిలోని…

TELANGANA

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు సమన్లను జారీ..

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు…

AP

దీపక్ వైపు చంద్రబాబు మొగ్గు-గేమ్ షురూ..!!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. ప్రతీ నియోజకవర్గం కీలకంగా మారుతోంది. రాయలసీమలో వైసీపీ సిద్దం సభ తరువాత టీడీపీ అలర్ట్ అయింది. వైసీపీకి బలం ఎక్కవగా అక్కడే ఫోకస్ కావటంతో సీమ జిల్లాల్లోనూ బలం చాటుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. దీంతో, టీడీపీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు.   సీమ లెక్కలు : రాయలసీమలో ఈ సారి హోరా హోరీ…

AP

వైసీపీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డికి టీడీపీ ఆహ్వానం..?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు రేపుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు. నెల్లూరు పార్లమెంటు స్ధానంలో ఈసారి ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికలో పట్టించుకోకపోవడంతో అలికి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ ఆయనకు ఆహ్వానం పలికింది.   వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి…

National

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేయలేదు: కేంద్రం.

భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఆర్థిక సంవత్సరం చివరి వరకు పొడిగించింది. దేశీయ లభ్యతను పెంచాలని, ధరలను అదుపులో ఉంచాలని కేంద్రం కోరుతున్నందున ఎగుమతి నిషేధం మార్చి 31, 2024 వరకు కొనసాగుతుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మంగళవారం (ఫిబ్రవరి 20) తెలిపారు.   సార్వత్రిక ఎన్నికలకు ముందు, మార్చి 31 తర్వాత కూడా నిషేధం ఎత్తివేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే రబీ (శీతాకాలం)లో ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉంటుందని…