News

AP

టీడీపీలోకి బైరెడ్డి .. చంద్రబాబుతో భేటీకి రంగం సిద్ధం..?

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారతున్నాయి. ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో దగ్గరపడటంతో రాజకీయ నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.   ఇప్పటికే అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే…

AP

ఇది వైసీపీ సర్కారు ఆఖరి ప్రయత్నమా?: చంద్రబాబు ఆగ్రహం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు, పత్రికలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు హయాంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు.   ‘జగన్‌రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టి, ప్రతిపక్షాల నుంచి పత్రికాధినేతలపై, పార్టీ కార్యకర్తలపై దాడికి పురికొల్పుతున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు…

TELANGANA

బీఆర్ఎస్‌తో పొత్తా..?: చెప్పులు చూపించమన్న బండి సంజయ్..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.   జమ్మూకశ్మీర్లో 370 ఆర్టికల్‌(Article 370) రద్దు చేసినందుకు 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలని కోరారు. బీజేపీ వెనుక రాముడు,…

TELANGANA

నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్, మంత్రుల భేటీ: చర్చించిన అంశాలివే..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీతో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లై ఓవర్ల ప్రాజెక్టుల అంశంపై కేంద్రమంత్రితో సీఎం చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే ప్రధాన రహదారులు, రీజనల్రింగ్రోడ్డు సహా పలు అంశాలపై సుమారు గంటపాటు చర్చలు జరిపారు.   ఈ సమావేశంలో సీఎం రేవంత్ వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ…

National

రేపిస్టులకు మరణ శిక్ష:.. ఛత్రపతి స్ఫూర్తిగా..: ప్రధాని మోదీ సంచలన ప్రకటన..

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనత పార్టీ.. కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడానికి అవసరమైన అజెండాను ఖరారు చేస్తోంది.   జాతీయ కార్యవర్గ సమావేశాలో..   దేశ రాజధానిలోని భారత్ మండప్ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, పదాధికారులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ…

TELANGANA

మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

మూసీ నది అభివృద్ధి ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మూసీలో మురుగునీటిని ముందుగా శుద్ధి చేయాలని సీఎం సూచించారు. సోమవారం మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్‌గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.   మూసీ సరిహద్దులు, ఇతర వివరాలతో కూడిన పటాలను అధికారులు సీఎంకు వివరించారు. అధికారులు పని విభజన చేసుకొని మూసీ పరీవాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం…

TELANGANA

తెలంగాణ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.   కాగా, తాజా నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయస్సును 44 నుంచి 46కు పెంచుతూ…

AP

ఎంపీగా నాగబాబు – విశాఖ అభ్యర్దులను ఖరారు చేసిన పవన్..

జనసేనాని పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన పోటీ చేసే స్థానాల పైన స్పష్టత ఇస్తున్నారు. పవన్ మరోసారి భీమవరం నుంచి పవన్ పోటీ చేయటం ఖాయమైంది. మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం ఖరారైంది. విశాఖ పరిధిలో జనసేన నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జ్ లను నియమించారు. పొత్తులు ఖాయమైన తరువాత వీరిని పార్టీ అభ్యర్దులుగా ప్రకటించనున్నారు. ఇదే సమయంలో పార్టీకి పవన్ రూ…

AP

చంద్రబాబుకు బిగ్ షాక్.. జగన్‌తో భేటీ అయిన టీడీపీ నేత..

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని వంటి టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరారు. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు.   మాజీ ఎమ్మెల్యే, నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన…

CINEMA

హరిహర వీరమల్లు గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్…

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోన్న అతడు.. ఇప్పటికే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా మూవీలు చేస్తున్నాడు.   పవన్ కల్యాణ్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. టాలీవుడ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ…