News

AP

చొక్కా మడతేయండి, “సైకిల్” బయట..”గ్లాస్” షింకులో వేయాలి – జగన్ గర్జన..!

వైసీపీ రాపప్తాడు సిద్దం సభకు జనం హోరెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తన పాలనలో అమలు చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలన్నారు. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని పేర్కొన్నారు. తాగేసిన టీ ట్లాస్ షింక్ లోనే ఉండాలంటూ టీడీపీ, జనసేన గుర్తుల గురించి వివరించారు. మరోసారి చొక్కా మడతేయటానికి సిద్దమా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుర్చీలు మడతేసి..చీపుర్లతో ఊడ్చి వారిని మరోసారి ఇంటికి పంపిద్దామంటూ జగన్ పిలుపునిచ్చారు.   జగన్ వ్యాఖ్యలు…

AP

ఏపీ రాజకీయాలపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు, జగన్‌పై ఇలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని.. ఇప్పుడు జగన్ కూడా భయపడ్డారని అన్నారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని విమర్శించారు.   రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చు కానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు ఉండవల్లి అరుణ్…

TELANGANA

తెలంగాణలో డ్వాక్రా మహిళలకు శుభవార్త ..

తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.   భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు.…

TELANGANA

మేడారం జాతరకు 6 వేల బస్సులు సిద్ధం..

తెలంగాణ కుంభమేళ మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మంది జాతరకు వెళ్లి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను (Sammakka Saralamma Jatara 2024) దర్శించుకుని బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతోంది.   ఈ బస్సులను ఆదివారం నుంచి ఫిబ్రవరి 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను…

TELANGANA

కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ ఫొటో..పార్టీ మార్పుపై క్లారిటీ..?

కాంగ్రెస్ పార్టీ నేతలతో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఫొటోలు వైరల్ కావడం చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ఆయన స్పందించారు. తాను కాంగ్రెస్పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీజేపీ సీనియర్నేత ఈటల రాజేందర్స్పష్టత ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్కొప్పుల నరసింహా రెడ్డి గృహ ప్రవేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు తప్పుడు వార్తలను సృష్టించారని మండిపడ్డారు.   తాను కాంగ్రెస్‌లో చేరనున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్అవుతున్న…

TELANGANA

గత పదేళ్ళలో ఇరిగేషన్ అవినీతి: ప్రాజెక్టులపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల..!

తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో నీటిపారుదల రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.   అనంతరం మాట్లాడుతూ…ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులలో అవినీతికి చోటులేకుండా, సమర్థ వినియోగంతో, అత్యధిక ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరం అయిన నిధులను సమకూర్చుకునే…

APNational

ఇస్రో మరో సక్సెస్- శ్రీహరికోట నుంచి నింగికి వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో కీర్తికిరీటంలో మరో మైలురాయి చేరింది. వాతావరణ పరిస్ధితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా మూడో తరం ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ని ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టారు. జీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.   భూఉపరితలం అధ్యయనంతో పాటు సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించేందుకు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో…

Uncategorized

అక్కడ కచ్చితంగా గెలవాల్సిందే: సీఎం జగన్ .

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణాన తలపడేందుకు అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోను అధికారంలోకి రావాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఆ పార్టీ జనసేనతోపాటు బీజేపీని కూడా కలుపుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య మహా యుద్ధం…

AP

వైసీపీ భూస్థాపితం.. తొక్కుకుని వెళ్తామని చంద్రబాబు హెచ్చరిక..

వచ్చే ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదిలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.   వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు…

National

ఢిల్లీలో రైతుల ఆందోళన, చలి తట్టుకోలేక కుప్పకూలిన రైతు, ఆసుపత్రిలో ప్రాణం పోయింది, అర్దరాత్రి..!

వివిధ డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు అడ్డుగోడ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ రైతు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఓరైతు మృతి చెందాడు. మరణించిన అన్నదాతను 78 ఏళ్ల జ్ఞాన్ సింగ్‌గా గుర్తించామని అధికారులు అంటున్నారు.   జ్ఞాన్ సింగ్‌ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నివాసి అని అధికారుల విచారణలో తెలిసింది. గురువారం రాత్రి విపరీతమైన చలితో బాధపడుతున్న జ్ఞాన్ సింగ్‌ శుక్రవారం తెల్లవారుజామున మృతి…