News

AP

అందుకే పవన్ కళ్యాణ్‌ను కలిసా: అంబటి రాయుడు..

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనాలోచిత నిర్ణయాలు.. ముక్కుసూటితనంతో క్రికెట్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అంబటి రాయుడు.. రాజకీయాల్లోనూ అదే తరహా శైలితో దూకుడు కనబరుస్తున్నారు.   ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన రాయుడు.. 10 రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను ఆశించిన సీటు దక్కలేదని, దాంతోనే పార్టీ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరగ్గా.. రాయుడు మాత్రం…

TELANGANA

తెలంగాణలో నూతన విద్యుత్ విధానం, నిరంతర విద్యుత్..

రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సుదీర్ఘంగా సమీక్షించారు.   రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబులతో…

CINEMA

గుంటూరు కారం సినిమాకు ప్రత్యేక షోలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవిరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సనిమా చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే సినిమా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు తెలంగాణ ధరలు పెంచుకుంటామని పర్మిషన్ అడగ్గా… రాష్ట్ర ప్రభుత్వం స్పందిచింది.…

TELANGANA

సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడక్షరాలే చాలా పవర్‌ఫుల్—; కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రంలో రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి దిగిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా తెలంగాణా భవన్ లో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలోకి రాని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి నెలలో ప్రజల మధ్యకు వస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండటం…

TELANGANA

మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ.. ఎన్ని జిల్లాలు ఎగిరిపోతాయో..?

తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాజకీయ అవసరాల కోసం పది జిల్లాలో ఏర్పడిన తెలంగాణలో పాత జిల్లాలను చలువలు పలువలుగా చీల్చేసింది. పదికి అదనంగా 23 జిల్లాలు.. మొత్తం 33 జిల్లాలుగా మార్చేసింది. ఇక రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కూడా అస్తవ్యస్తంగా జరిగింది. పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై సమీక్ష చేయాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌…

AP

వైసీపీది దొడ్డిదారి.. ఈసీకి చంద్రబాబు, పవన్ ఫిర్యాదు..

గత కొద్దిరోజులుగా ఓటర్ల జాబితా పై పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ విపక్షాల నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన అధికారులకు ఇదే అంశంపై విపక్ష నేతలు ఫిర్యాదు చేయడం విశేషం.ముఖ్యంగా మార్పులు, చేర్పుల్లో అవకతవకలు…

AP

రాజ్యసభ ఎన్నికలు జగన్ కు ప్రాణసంకటమే..

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఝలక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించినా.. సంఖ్యా బలం లేకున్నా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టిడిపి దక్కించుకుంది. ఏకంగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల మద్దతును పొందింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సైతం అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యసభలో ఏపీకి చెందిన సీఎం రమేష్, కనక మేడల రవీంద్ర కుమార్, వేంరెడ్డి…

National

కాంగ్రెస్ టార్గెట్ అంతసులువు కాదు..

వ్యూహాలు రచించినా.. ఒక్కోసారి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సహకరించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితులు సహకరిస్తున్నాయా? రాష్ట్రాల్లో లెక్కలు ఏం చెబుతున్నాయి? ఒక వైపు మోడీ 400 సీట్లు టార్గెట్ అంటుంటే.. దాన్ని తగ్గించడంలో కాంగ్రెస్‌కు సహకరించే అంశాలు ఏమున్నాయి?   ఇటీవలి CVoter ఒపీనియన్ పోల్‌తో పాటు ఇతర విశ్వసనీయ డేటా విశ్లేషణ ప్రకారం, 2024 పోరాటంలో ప్రతిపక్షాలు ఏటవాలుగా ఉన్న పర్వతాన్ని ఎక్కాల్సి ఉంటుందన్నది స్పష్టం. అయితే, బీజేపీ గెలవాలని అనుకుంటున్న…

AP

సంక్రాంతి పండుగని కోడిపందేలు, పేకాట ఆడితే కఠినచర్యలు తప్పవు: ఏపీ పోలీసుల వార్నింగ్!!

సంక్రాంతి రోజులలో సాంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కోడిపందాలు,పేకాట నిర్వహుకులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని జూదం అనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది అని అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించమని చెప్తున్నారు.   కోడి పందాలు, కోడి కత్తులు తయారీదారులు పేకాట,నిర్వహకుల పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బైండోవర్ కేసులు…

AP

గీత దాటితే వేటే..ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీఎం జగన్ సీరియస్ నిర్ణయం!!

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల వైసీపీ ఇంచార్జ్ ల మార్పు పలువురు నేతలు టీడీపీ, జనసేన బాట పట్టటానికి కారణం అయ్యింది. ఏపీలో సీఎం జగన్ నిర్ణయంతో వైసీపీ నుండి ప్రత్యర్థి పార్టీలకు వలసలు పెరుగుతున్న క్రమంలో వైసీపీ గీత దాటుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలకు సిద్ధమైంది.   పార్టీ విధానాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ పార్టీ లైన్…