News

TELANGANA

అన్నదాతలకు శుభవార్త.. ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణ మాఫీ..!

తెలంగాణలో అధికారంలోకి రాగానే రూ.2 లక్ష రైతు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో అన్నదాతల రుణాలు మాఫీ చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అన్నదాతలపై వడ్డీ భారం లేకుండా రుణ మాఫీ చేయాలనీ యోచిస్తోంది. రైతు రుణ మాఫీ ఒకేసారి చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు దఫాలుగా రుణ మాపీ చేసినా.. అందరు రైతులకు రుణ మాఫీ కాలేదు.  …

TELANGANA

వచ్చే నెల నుంచే గృహజ్యోతి, రూ.500 లకే సిలిండర్..!

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆభయ హస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఆభయ హస్తం దరఖాస్తు వివరాలను సిస్టంలో ఎంట్రీ చేస్తున్నారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాపాలన సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులపై చర్చించారు.   ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ ఎక్కడి వరకు వచ్చింది. ఎప్పుడు…

National

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రిసారిగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫిబ్ర‌వ‌రి 1న మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో మ‌హిళా రైతుల‌కు పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి కింద ఇచ్చే న‌గ‌దు సాయాన్ని రెట్టింపు చేస్తార‌ని భావిస్తున్నారు.

AP

జగన్ సర్కార్ కు ఈసీ భారీ షాక్..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ వైసీపీ ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అధికారులు అధికార పార్టీ మాట విని అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన ఈసీ.. విజయవాడలో నిర్వహించిన సమీక్షలో అక్షింతలు వేసింది. తటస్ధంగా ఉంటారా లేదా అని ప్రశ్నించింది. దీంతో కలెక్టర్లు, ఎస్పీలు ఇరుకునపడ్డారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.   రాష్ట్రంలో ఎన్నికల విధులకు వైసీపీ ప్రభుత్వం సచివాలయాల సిబ్బందిని బీఆల్వోలు,…

AP

వైసీపీ మూడో జాబితా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.   ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే…

TELANGANA

మైక్రాన్ కంపెనీ సీఈవోతో సిఎం రేవంత్ భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ సీఈవో సంజయ్ మెహ్రోత్రాతో గురువారం సిఎం నివాసంలో భేటీ అయ్యారు. అమెరికాలోని మైక్రాన్ టెక్నాలజీస్ కంపెనీ.. ప్రపంచంలోనే అతి పెద్ద మెమోరీ చిప్ తయారీ సంస్థలో ఒకటి. అమెరికా నుంచి సీఈవో సంజయ్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వచ్చారు. మెమోరీ చిప్ తయారీ పరిశ్రమ స్థాపించేందుకు, కంపెనీ పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలంగా ఉందని సంజయ్ తెలిపారు.   సిఎం రేవంత్ రెడ్డి కూడా మైక్రాన్ కంపెనీ పరిశ్రమ…

TELANGANA

బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా మార్పు..!?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకొనే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పార్టీ పేరు పైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్పు చేయాలని సీనియర్లు కోరుతున్నారు. మరి ఈ దిశగా కేసీఆర్ అంగీకరిస్తారా.   తిరిగి మారుస్తారా : బీఆర్ఎస్ పేరును తిరిగి…

National

అయోధ్య రామ‌మందిర గ‌ర్భ‌గుడికి మొద‌టి బంగారు త‌లుపు ఏర్పాటు…..

అయోధ్య‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న రామ‌మందిరం ఈ నెల 22న ప్రారంభించ‌న‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. అయితే, అయోధ్య రామ‌మందిరానికి మొద‌టి బంగారు త‌లుపును ఏర్పాటు చేశారు. గ‌ర్భ‌గుడి మొదటి అంత‌స్తులో బంగారు త‌లుపును ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న బంగారు త‌లుపును అమ‌ర్చ‌డం జ‌రిగింది. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్…

AP

టీడీపీతో పొత్తు చర్చల వేళ బీజేపీ అనూహ్య నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ సింగిల్ గానే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తుతో రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందనే భావిస్తున్నాయి. ఏపీలో తిరిగి బలం పెంచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది.   మారుతున్న లెక్కలు : ఏపీలో పొత్తు ఖాయం చేసుకున్న…

TELANGANA

వాహనదారులకు గుడ్ న్యూస్-జనవరి 31వరకూ గడువు పొడిగింపు..

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ఇవాళ్టితో ముగిసింది. దీనికి వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అయితే సర్వర్ సమస్యల కారణంగా ఆన్ లైన్లో ఎక్కువ మంది ఈ అవకాశం వినియోగించుకోలేకపోయామంటూ ఫిర్యాదులు చేశారు. దీంతో వీరంతా చెల్లింపు కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువును ఈ నెలాఖరు వరకూ పెంచింది.   ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3.59…