News

National

యూపీఐ పేమెంట్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు.. ఎవరికంటే..?

దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు చేసే (పర్సన్-టు-మర్చంట్) యూపీఐ చెల్లింపుల గరిష్ఠ పరిమితిని పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం, నిర్దిష్ట కేటగిరీలలోని ధృవీకరించిన వ్యాపారులకు వినియోగదారులు ఒకే రోజులో గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు చెల్లింపులు జరపవచ్చు.   అయితే, వ్యక్తుల మధ్య (పర్సన్-టు-పర్సన్) జరిగే నగదు బదిలీల…

TELANGANA

మేడారం పర్యటనకు సీఎం రేవంత్‌ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ నెల 13, 14 తేదీల్లో ములుగు జిల్లాలోని మేడారాన్ని సందర్శించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ స్వయంగా మేడారాన్ని సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు.   గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన   సీఎం పర్యటనలో భాగంగా, మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి రెండు…

TELANGANA

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిని.. పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో.. రైల్వే ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారులు పాల్గొన్నారు.   కీలక అధికారుల హాజరు   ఈ సమీక్ష సమావేశానికి ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్‌పోర్ట్ అండ్ బిల్డింగ్స్ స్పెషల్ సెక్రటరీ…

AP

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం: మంత్రి నాదెండ్ల.

రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవరణలన్నీ ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.…

AP

మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌ చిక్కు.. వివాహిత అభ్యర్థులకు కొత్త నిబంధన..

మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో కీలకమైన సర్టిఫికెట్ల పరిశీలన దశలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ అనూహ్యమైన నిబంధన విధించడంతో వారిలో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు చెల్లవని, తాజాగా భర్త పేరుతో, ఆయన ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.  …

National

ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ ఓట్ల చోరీ.. బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్..

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లను దొంగిలించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఇదే పని చేస్తోందని, ‘ఓట్ల దొంగ’ వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.   ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు అనుకూలంగా ‘ఇండియా’ కూటమికి చెందిన పలువురు…

TELANGANA

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కేటీఆర్ సర్వే..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వే చేయిస్తున్నామని, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని బస్తీల్లో వెనుకంజలో ఉన్నామని, అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉప ఎన్నిక ఉంటుందని చెప్పారు.   మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన…

TELANGANA

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా పై మరోమారు సంచలన వాఖ్యలు..!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమి చేసుకుంటారో చేసుకోండంటూ తీవ్రంగా స్పందించారు. తన రాజకీయ వైఖరిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని అన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా…

AP

నాది, పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటే.. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు..

“మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. దర్జాలు, ఆర్భాటాలు ప్రదర్శించడం కుదరదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అహంకారం, అవినీతి, అలసత్వం వంటివి దరిచేరనివ్వొద్దని గట్టిగా సూచించారు.   బుధవారం అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో ఆయన మాట్లాడుతూ, తన ఆలోచన, మిత్రపక్ష…

AP

తురకపాలెం మరణాల కేసులో కీలక మలుపు..! అసలు కారణం అదేనా..?

గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర కలకలం రేపిన వరుస మరణాల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ విషాద ఘటనలకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. కలుషితమైన సెలైన్ వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.   గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఈ ఆర్ఎంపీ వద్దకే వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. వారికి కలుషితమైన సెలైన్లతో పాటు, మోతాదుకు…