News

TELANGANA

రాష్ట్ర అవసరాలపై మంత్రి సీతక్క ప్రజెంటేషన్.. నిధులు ఇవ్వమని కేంద్రానికి విజ్ఞప్తి..

తెలంగాణ‌లోని తాగునీటి వ్య‌వ‌స్థ స్థిరీక‌ర‌ణ‌ కోసం అవ‌స‌ర‌మైన‌ నిధులు మంజూరు చేయాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క కేంద్ర ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ తాగునీటి అవ‌స‌రాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గ‌తంలో సిఫార్సు చేసిన విధంగా క‌నీసం రూ.16 వేల కోట్ల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ప్ర‌తి ఏటా తాగు నీటి అవ‌స‌రాల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం సుమారు రూ. 5 వేల కోట్ల‌ను వెచ్చిస్తుంద‌ని గుర్తు చేశారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ…

TELANGANA

ఆరు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు కేసీఆర్.. వాటిపై చర్చించే అవకాశం..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చాన్నాళ్ల తర్వాత పార్టీ ఆఫీసుకు వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల వైపు కాకుండా.. కేవలం ఉప ఎన్నికలపై ఫోకస్ చేశారా? అందుకోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.   ఎంతమంది హాజరు?   బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్…

AP

జనసేన ఆవిర్భావ వేడుకలపై కీలక నిర్ణయం..

జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.   సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలకపాత్రను పోషించింది. ఘన విజయం తర్వాత మొదటి ఆవిర్భావ సభ కావడంతో… సభకు భారీ ఏర్పాట్లు…

National

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్.. ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి..

భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గత రాత్రి వేర్వేరుగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా ఎంపిక చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. మరో ఈసీగా సుఖ్‌బీర్ సింగ్ ఉన్నారు.   అంతకుముందు ప్రధానమంత్రి…

NationalTechnology

యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే..

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు.   ఫోన్‌పే వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ…

National

హమాస్ సంచలన ప్రకటన.. గాజాను వదులుకునేందుకు రెడీ..!

ఇజ్రాయెల్‌లో మారణహోమాన్ని సృష్టించి.. తద్వారా యుద్ధానికి కారణభూతమైన హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజా స్ట్రిప్ పై అధికారాన్ని వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈజిప్ట్ ఒత్తిడితోనే హమాస్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. గాజాలో ప్రస్తుతం పోలీస్, ఆరోగ్యం, పౌరసేవలు అన్నీ హమాస్ నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి బదలాయించేందుకు అంగీకరించింది. కాగా, హమాస్ నిర్ణయం వెనక డొనాల్డ్ ట్రంప్ విధానం కూడా ఒక కారణమని తెలుస్తోంది.   పాలస్తీనా…

TELANGANA

సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. సర్వత్ర ఉత్కంఠ..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది.   గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా……

CINEMA

పోలీస్ స్టేషన్ వద్ద మంచు మనోజ్ నిరసన .. ఎందుకంటే..!

సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మనోజ్ తిరుపతిలోని విద్యాసంస్థలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న విషయం తెలిసిందే.   తాజాగా మంచు మనోజ్ పోలీసుల తీరును నిరసిస్తూ తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశాడు. సోమవారం రాత్రి 11.15 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఆయన…

AP

అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టండి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే… కేవలం 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. మిగిలిన స్టేషన్లలో కెమెరాలు ఎందుకు పెట్టలేదని నిలదీసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని పీఎస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని…

AP

త్వరలో ఏపీకి 5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు..

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత రెండో రోజు సోమవారం కూడా పాల్గొన్నారు.   ఈ…