News

TELANGANA

విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘ఫెలోస్ ఇండియా’ అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులకు వైద్యులు స్వచ్ఛందంగా సీపీఆర్ (CPR) ప్రక్రియపై అవగాహన కల్పించి శిక్షణ ఇస్తే, ఆపద సమయంలో వారు ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించడంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. తాను వృత్తిరీత్యా…

AP

ఏపీలో జనగణన షురూ: తొలిసారి డిజిటల్ లెక్కలు – అడ్డుకుంటే జైలు శిక్ష తప్పదు!

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా లెక్కల సేకరణ (Census) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రక్రియలో భాగంగా, ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌లను రూపొందించారు. ఈ విధులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మున్సిపల్, సబ్ డివిజన్ స్థాయిలో ప్రత్యేక కమిటీలను మరియు అధికారులను ఇప్పటికే నియమించింది. జనగణన షెడ్యూల్ మరియు వివరాలు: ఈ ప్రక్రియను రెండు ప్రధాన దశల్లో పూర్తి చేయనున్నారు: తొలి దశ…

CINEMA

చిరంజీవి సినిమా టికెట్ ధరల వివాదం: హైకోర్టులో పిటిషన్ దాఖలు – విచారణకు నిరాకరణ!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ధరల పెంపు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ న్యాయవాది విజయ్ గోపాల్ తెలంగాణ హైకోర్టులో ‘హౌస్ మోషన్’ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా ధరలను పెంచి సామాన్య ప్రేక్షకుడిపై భారం మోపుతోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని…

TELANGANA

తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయంతో మారనున్న రాజకీయ సమీకరణాలు!

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య ఇప్పటికే త్రిముఖ పోరు సాగుతుండగా, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఎంట్రీతో ఈ పోటీ ఇప్పుడు చతుర్ముఖ పోరుగా మారబోతోంది. ఏపీలో కూటమి విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని తెలంగాణలోనూ కొనసాగించాలని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని జనసేనాని ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్…

AP

ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మెకు తెర..!

ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో దూర ప్రాంత సర్వీసులు కాకుండా… స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 2,419 ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, దీనివల్ల డిజిల్‌ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు…

AP

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలనం..!

భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది.. అయితే, తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో…

CINEMA

సెన్సార్ బోర్డుకు కాలం చెల్లింది: రామ్ గోపాల్ వర్మ..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై, దాని పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డు అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని, దాని ఉనికి ఒక పెద్ద జోక్ అని ఆయన అభిప్రాయపడ్డారు. నటుడు విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమా సెన్సార్ వివాదం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   “ఈ రోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని భావించడం అవివేకం. దాని అవసరం ఎప్పుడో…

TELANGANA

రైతులకు సంక్రాంతికి మరో తీపికబురు చెప్పిన రేవంత్ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి ముందు రైతులకు మరోమారు శుభవార్త చెప్పింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అఫిడవిట్ దాఖలు చేసే నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే భూ సమస్యల పరిష్కారం మరింత త్వరితగతిన జరుగుతుందని దీని కారణంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.   సాదా బైనామా సమస్యల పరిష్కారానికి జీవో మరో రెండు…

TELANGANA

కరీంనగర్ కు కేంద్రం గుడ్ న్యూస్..! ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

కరీంనగర్ జిల్లాకు కేంద్రమంత్రి బండి సంజయ్ తీపికబురు చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, కరీంనగర్ జిల్లాలో ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 50 పడకల సామర్థ్యంతో కరీంనగర్ జిల్లాలో ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్రం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది.   ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్ల…

AP

కదిరి బాలికల కళాశాలలో నూతన భవనాలు, ల్యాబ్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మించిన నూతన పాఠశాల భవనం, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ గదులు మరియు అదనపు తరగతి గదులను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ సౌకర్యాలను విద్యార్థినులకు అంకితం చేసిన ఆయన, విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…