News

National

అమెరికా నుంచి భారీగా చమురు కొంటున్న భారత్..!

అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ఇంధన వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచుతోంది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), తాజాగా ఆగస్టు నెలలో దాదాపు 20 లక్షల బ్యారెళ్ల అమెరికా ముడి చమురుకు ఆర్డర్ ఇచ్చింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది.   ఇంధన అవసరాల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను…

AP

అనంతపురం టీడీపీలో రచ్చ… ఎమ్మెల్యే Vs ప్రభాకర్ చౌదరి..

అనంతపురం టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా దగ్గుపాటికి ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. దగ్గుపాటి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని… ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేద్దామని… ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దామని సవాల్ విసిరారు. సమాధులు ఆక్రమించిన వాళ్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన…

TELANGANA

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై బండి సంజయ్ సంచలన వాక్యాలు..!

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అంటే, మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.…

NationalTechnology

బీఎస్ఎన్ఎల్ ముందడుగు … అందుబాటులోకి ఈ-సిమ్ సదుపాయం..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం రెండు కీలకమైన కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై భౌతిక సిమ్ కార్డు అవసరం లేని ఈ-సిమ్ సౌకర్యంతో పాటు, రోజురోజుకూ పెరిగిపోతున్న స్పామ్ కాల్స్, మోసపూరిత సందేశాల నుంచి రక్షణ కల్పించేందుకు యాంటీ-స్పామ్ టూల్స్‌ను ప్రారంభించింది. ఈ చర్యల ద్వారా కస్టమర్లకు మెరుగైన సౌలభ్యం, డిజిటల్ భద్రత కల్పించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.   ఫిజికల్ సిమ్‌కు స్వస్తి……

National

పుతిన్‌తో,ట్రంప్ చర్చలు ఫ‌ల‌ప్ర‌దం..

గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఫలప్రదంగా ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశగా గొప్ప పురోగతి సాధించామని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే, తుది ఒప్పందం ఖరారయ్యే వరకు ఏదీ ఖరారైనట్లు కాదని ట్రంప్ స్పష్టం చేశారు.  …

National

జీఎస్టీలో భారీ సంస్కరణలు..! సామాన్యుడికి భారీ ఊరట..!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘డబుల్ దీపావళి’ హామీ కార్యరూపం దాల్చనుంది. దేశ పరోక్ష పన్నుల విధానంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న పలు జీఎస్టీ శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను కొనసాగించాలనే కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాడే అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.   కొత్త విధానం…

TELANGANA

విమర్శించడం లేదంటూనే రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇటీవల తరచూ విరుచుకుపడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సొంతపార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో గత రాత్రి నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ‘పదవులూ మీకే.. పైసలూ మీకేనా?’ అని నిలదీశారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్ పని చేయడం లేదని, ముఖ్యమంత్రి ఇస్తేనే ఆ బిల్లు వస్తుందని అన్నారు. కాబట్టే సీఎంను ప్రశ్నిస్తున్నానని,…

TELANGANA

తెలంగాణలో వాహనదారులకు షాక్..!

తమకు ఇష్టమైన వాహనం కొనుగోలు చేసిన తర్వాత, దానికో ఫ్యాన్సీ నంబర్ కోసం వేలంలో పోటీ పడేవారికి తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో రవాణా శాఖకు ఏటా రూ. 100 కోట్లకు పైగా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు…

TELANGANA

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు..! బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ..!

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సిఎం రేవంత్ రెడ్డి.. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఒక్క కార్పొరేషన్ పై దృష్టి పెట్టడం అరుదు. అయితే అక్కడ కాంగ్రెస్ ఎగురవేయాలని.. పట్టుదలతో ఉన్నారు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో బిజెపితో పాటు బీఆర్ఎస్ గట్టిగా ఉంది. గత రెండు సార్లు మేయర్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో.. మేయర్ సీటు సాధించాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారంట. అయితే అక్కడ బలమైన నేత…

AP

ఏపీలో మొదలైన మహిళల ఫ్రీ బస్..!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మొదలయ్యాక, RTC బస్సులు ఇప్పుడు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, సమాచారం పంచే మాధ్యమాలుగా కూడా మారిపోయాయి. కండక్టర్ చేతిలో మైక్ పట్టుకుని, మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఆధార్ చూపించి సద్వినియోగం చేసుకోండని బస్సు మొత్తం మార్మోగేలా చెబితే, ప్రయాణికుల ముఖాల్లో ఒక ఆసక్తి, ఒక సంతోషం కనబడుతోంది. గ్రామీణ రూట్లలో అయితే ఈ సన్నివేశం మరింత అందంగా, మరింత దగ్గరగా అనిపిస్తోంది.   ఏపీ…