అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర..
అమరావతి రాజధాని రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించి, చట్టబద్ధత లభించిన శుభతరుణంలో రాజధాని ప్రాంత మహిళలు తమ భక్తిని, కృతజ్ఞతను చాటుకున్నారు. తమ కలల రాజధాని సాకారం కావాలని ఇన్నాళ్లూ పట్టువదలని దీక్ష చేసిన మహిళా రైతులు, నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి ఆశయం నెరవేరినందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, రాజధాని గ్రామాల నుండి కాలినడకన బయలుదేరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. కాలి నడకన కనకదుర్గమ్మ చెంతకు..…

