సంధ్యా థియేటర్ కేసు: పోలీసులపై నాంపల్లి కోర్టు తీవ్ర అసహనం.. మూడోసారి ఛార్జిషీటు తిరస్కరణ
హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై నాంపల్లి కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును కోర్టు వరుసగా మూడోసారి వెనక్కి పంపడం గమనార్హం. నిందితుల పాత్రను నిర్ధారించే విషయంలోనూ, ఘటన జరిగిన తీరును వివరించడంలోనూ పోలీసులు సరైన ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాంకేతిక లోపాలు మరియు అసంపూర్ణ సాక్ష్యాలతో కూడిన నివేదికను…

