News

TELANGANA

సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, అక్కడే అంత్యక్రియలు: తెలంగాణ ప్రభుత్వం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాద్ నగరానికి చెందిన 45 మంది యాత్రికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మృతుల ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ నగరానికి చెందినవారే కావడంతో, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు మంత్రివర్గం ఈ…

AP

రామోజీరావు లాంటి 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు: ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రామోజీరావును ‘అక్షర యోధుడు’ అని కొనియాడారు, తెలుగుజాతి గర్వించదగిన రామోజీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డులు అత్యున్నత స్థాయికి చేరుతాయని ఆకాంక్షించారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా నిలిచి ఉంటాయన్నారు. ముఖ్యంగా, నమ్మిన సిద్ధాంతం కోసం రామోజీ దేన్నైనా వదులుకున్నారని, తన జీవితంలో ఫలానా పని చేసిపెట్టాలని ఆయన ఎవరినీ అడగలేదని…

National

బీహార్ ఎన్నికల ఫలితాలతో లాలూ కుటుంబంలో చిచ్చు: రాజకీయాల నుంచి రోహిణి ఆచార్య ఔట్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ (RJD)-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం చవి చూసిన నేపథ్యంలో, ఆర్‌జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లు మాత్రమే గెలుచుకుని భారీ ఓటమి చవిచూసిన మరుసటి రోజే ఆమె ఈ ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు, అంతేకాక తన కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు శనివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రోహిణి ప్రకటించారు.…

TELANGANA

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి నాంపల్లి కోర్టుకు తరలింపు

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈరోజు (శనివారం) ఉదయం సీసీఎస్ పోలీసులు కూకట్‌పల్లి ప్రాంతంలో ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత ఉదయం నుంచి సీసీఎస్ పోలీసులు అతడిని విచారించి, అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాలో ఉన్న మూడు కోట్ల రూపాయల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇతను కరేబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’…

National

ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ ముఖ్యమంత్రి బృందంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వీరు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను మరియు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా భేటీ అయ్యారు. పార్టీ అగ్ర నాయకత్వంతో…

AP

విశాఖలో అక్రమ గోమాంసం నిల్వలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు

విశాఖపట్నంలో భారీగా అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కఠినంగా స్పందించారు. ఈ దందాకు సంబంధించిన ముఠాల అసలు మూలాలను వెంటనే గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ అధికారులను స్పష్టం చేశారు. ఈ కేసులో ఎంతటి వ్యక్తులు ఉన్నా క్షమించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్వయంగా పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి మొత్తం వివరాలను…

TELANGANA

మేడారం జాతరకు ఆర్టీసీ గుడ్‌న్యూస్: ప్రత్యేక బస్సులు, నవంబర్ నుంచే సేవలు

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ఆర్టీసీ (TSRTC) ఇప్పుడే సన్నద్ధమవుతోంది. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, వనదేవతలను…

AP

బీహార్ ఎన్డీయే విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం ముంగిట నిలబడడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ మరియు జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన లేదా ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయానికి ప్రధాన కారణం, కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న నిరంతర విశ్వాసం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత భారత్’ దార్శనికత…

TELANGANA

జూబ్లీహిల్స్ ఓటమిపై కేటీఆర్ స్పందన: “ప్రధాన ప్రత్యర్థి మేమే”

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితం తమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తమమే ప్రధాన ప్రత్యర్థి అని తేల్చి చెప్పినట్లు అయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, తాము ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రుజువు చేశాయని…

National

ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి కనుమరుగవుతున్న కాంగ్రెస్!

దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన పట్టును కోల్పోయి, కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఢిల్లీ స్థాయిలోనూ, క్షేత్ర స్థాయిలోనూ కాంగ్రెస్ బలహీనపడుతోంది. దీనికి ప్రధాన కారణం, అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ఉండాల్సిన దుస్థితి ఏర్పడటమే. కర్ణాటక, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ జాతీయ పార్టీగా సొంతంగా పోటీ చేసి అధికారాన్ని సాధించినప్పటికీ, మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్లపై ఆధారపడి రాజీ ధోరణిలో ఉండాల్సి వస్తుంది. దశాబ్దాల…